*🌼నవోదయ' ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం*
☀️జవహర్ నవోదయ విద్యాలయాల్లో
2021-22 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా ఎంపిక పరీక్షలు నిర్వహిస్తారు
☀️అర్హులైన వారు ఎంపిక పరీక్షకు డిసెంబరు 15లోగా దరఖాస్తు చేసుకోవాలి
☀️ప్రభుత్వ పాఠశాలు, ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2020-21 విద్యాసంవత్సరంలో ఐదవ తరగతి చదువుతున్న బాల, బాలికలు ఎంపిక పరీక్ష రాసేందుకు అర్హులు
*☀️వీరు 2008, మే 1వ తేదీ నుంచి 2012, ఏప్రిల్
30 మధ్య జన్మించిన వారై ఉండాలి*
☀️ఎంపిక పరీక్షలు
ఆంగ్లం, హిందీ, కన్నడ, ఇతర భాషలతో పాటు తెలుగులోనూ
నిర్వహిస్తారు
🍁దరఖాస్తు ఇలా....
☀️దరఖాస్తును www.navodaya.gov.in website ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. దానిని పూరించి తిరిగి అదే వెబ్ సైట్లో డిసెంబరు 15వ తేదీలోగా అప్లోడ్ చేయాలి.
దరఖాస్తును ఒక ప్రింట్ తీసుకుని, విద్యార్ధుల వద్ద ఉంచుకోవాలి.
🍁తొమ్మిదవ తరగతికి పరీక్ష..
నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదవ తరగతిలో మిగిలి ఉన్న
సీట్లకు ప్రవేశం కల్పిస్తున్నారు. ప్రవేశం కోరే బాల, బాలికలు
కూడా వెబ్ సైట్ నుంచి దరఖాస్తును డౌడ్లోడ్ చేసుకుని
దానిని పూరించి డిసెంబరు 15వ తేదీలోగా అప్లోడ్
చేయాలి.
🍁పరీక్షలు ఎప్పుడంటే..
☀️ఆరో తరగతిలో ప్రవేశం కోరే విద్యార్ధులకు 2021 ఏప్రిల్ 10వ తేదీన ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు.
☀️తొమ్మిదవ తరగతి లో ప్రవేశం కోరే విద్యార్థులకు 2021, ఫిబ్రవరి 18వ తేదీన ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు.
0 comments:
Post a comment