*నాడు–నేడు (మనబడి)పై సీఎం శ్రీ వైయస్ జగన్ సమీక్ష:*
*ఫిబ్రవరి నాటికి నాడు-నేడు (మనబడి) తొలి దశ పనులు పూర్తి కావాలి*
*రెండో దశ పనుల్లో హాస్టళ్లలో పూర్తి సౌకర్యాలు కల్పించాలి*
*నాడు–నేడు మనబడిలో మొత్తం 10 రకాల పనులు చేయాలి*
*పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు*
*పనులు పూర్తయ్యాక, అన్నింటి నిర్వహణ కూడా కీలకం*
*నాడు- నేడు పనుల పరిశీలన కోసం ఒక ప్రత్యేక విభాగం*
*పాఠశాల విద్యాశాఖ పరిధిలోనే ఈ విభాగం*
*ముఖ్యంగా బాత్రూమ్ల నిర్వహణ చాలా కీలకం*
*బాత్రూమ్ల నిర్వహణ పై ప్రణాళిక సిద్ధం చేయండి*
*పెయింటింగ్తో సహా అన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశీలించాలి*
*బ్యాగు, షూ, టెక్ట్స్బుక్స్ పిల్లలకిచ్చే ఏ వస్తువు నాణ్యతలోనూ రాజీ పడొద్దు*
*హాస్టళ్లలో కూడా జగనన్న గోరుముద్ద తరహాలో పౌష్టికాహారం*
*ఆ మేరకు ప్రత్యేకంగా మెనూ రూపొందించండి*
*మన పిల్లలు హాస్టల్లో ఉంటే ఎలాంటి వసతులు కోరుకుంటామో*..
*అలాగే అన్ని హాస్టళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి*
*ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ వెల్లడి*
*నాడు–నేడు ‘మనబడి’పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ సమీక్ష నిర్వహించారు.
మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ కమిషనర్ విజయ్కుమార్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వి.చినవీరభద్రుడుతో పాటు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు.
*సమీక్షలో సీఎం శ్రీ వైయస్ జగన్ ఏమన్నారంటే..:*
– నాడు నేడు తొలి దశ పనులు కచ్చితంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి కావాలి.
_ నాడు నేడు పనుల పరిశీలన కోసం విద్యాశాఖలో ఉన్నత స్థాయి విభాగాన్ని ఏర్పాటు చేయాలి.
పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడొద్దు.
– రెండో దశలో చేపడుతున్న పనుల్లో హాస్టళ్లు కూడా ఉన్నాయి.
– కాబట్టి 2022 సంక్రాంతి నాటికి అన్ని హాస్టళ్లలో బంకర్ బెడ్లతో సహా, అన్ని సదుపాయాలు తప్పకుండా ఉండాలి.
మంచాలు, పరుపులు, బెడ్షీట్లు, బ్యాంకెట్లు, అల్మారాలు ఏర్పాటు చేయాలి.
*జూనియర్ కళాశాలలు*
_రాష్ట్రంలోని ప్రతి మండలంలో తప్పనిసరిగా ఒక జూనియర్ కళాశాల ఉండాలి
ప్రస్తుతం 159 మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేవు
అందువల్ల ఆయా చోట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలి
*మనం ఏం కోరుకుంటామో..:*
– మన పిల్లలను హాస్టల్లో ఉంచితే ఎలాంటి సౌకర్యాలు కోరుకుంటామో అవన్నీ కూడా అన్ని హాస్టళ్లలో ఉండాలి.
– ముఖ్యంగా బాత్రూమ్లు చక్కగా ఉండాలి. వాటిని బాగా నిర్వహించాలి.
– ఇంకా చెప్పాలంటే మరమ్మతులు రాకుండా ఉండే విధంగా మెటీరియల్ వాడాలి, అన్ని బాత్రూమ్లలో హ్యాంగర్స్ కూడా ఉండాలి.
–గిరిజన ప్రాంతాల హాస్టళ్లలో బాత్రూమ్లలో నీళ్లు లేక, విద్యార్థులు బయటకు వెళ్లడం నేను స్వయంగా చూశాను.
– అందువల్ల హాస్టళ్లలో బాత్రూమ్ల నిర్వహణ పై ప్రణాళిక సిద్ధం చేయండి.
– ఇప్పటికే హాస్టళ్లలో మెనూకు సంబంధించి యాప్ ఉండగా, బాత్రూమ్లపై కూడా యాప్ డెవలప్ చేయాలి.
– ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పనుల ఫలితాలు దీర్ఘకాలం ఉండాలి. కాబట్టి నిర్వహణలో ఎక్కడా అలక్ష్యం చూపొద్దు.
– ఆ విధంగా పెయింటింగ్తో సహా మెయింటెనెన్స్ ఉండాలి,
– భవిష్యత్తులో అంగన్వాడీలలో కూడా నాడు–నేడు కొనసాగుతుంది, కాబట్టి పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ వద్దు.
–రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ, ఏ స్కూల్లో, ఏ సమస్య వచ్చినా ఎంత వేగంగా స్పందించి, దాన్ని బాగు చేశామన్న దానిపై మన ప్రతిభ, పనితీరు ఆధారపడి ఉంటుంది.
*జగనన్న విద్యా కానుక:*
– ఈ కిట్లో ప్రతి ఒక్కటి కూడా నాణ్యత కలిగి ఉండాలి.
– స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫామ్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్ పంపిణీ.
– వచ్చే విద్యా సంవత్సరంలో జూన్ 12న స్కూళ్లు ప్రారంభం అవుతాయనుకుంటే పిల్లలకు జూన్ 1న పంపిణీ చేయాలి.
– ఆ మేరకు స్కూళ్లలో కిట్లు మే 15 నాటికి సిద్ధంగా ఉండాలి.
*జగనన్న గోరు ముద్ద–హాస్టళ్లు:*
– హాస్టల్ పిల్లలకు ప్రతి రోజు ఒక వెరైటీ ఫుడ్ ఉండాలి, ఆ మేరకు ప్లాన్ చేయండి.
– మార్పు చేసిన మెనూ ప్రకారం పక్కాగా సరఫరా జరుగుతోందా? లేదా? అన్నది కూడా ఎంతో ముఖ్యం.
– ఆ ప్రకారం డిజైన్ చేసిన దాని ప్రకారం పెడుతున్నామా? లేదా? అన్నది మొదటి ప్రమాణం అని సీఎం శ్రీ వైయస్ జగన్ స్పష్టం చేశారు.
కాగా, కార్యక్రమంలో నాడు–నేడు మనబడి కార్యక్రమంలో పనుల పురోగతిని అధికారులు సమావేశంలో వివరించారు.
– నాడు నేడు తొలి దశ పనులు కోవిడ్ కారణంగా కాస్త ఆలస్యమయ్యాయి.
– అయితే పనులు మాత్రం అత్యంత నాణ్యతగా కొనసాగుతున్నాయి.
– పేరెంట్ కమిటీలు, హెడ్మాస్టర్లు, సచివాలయాల ఇంజనీర్లు, టాటా ప్రాజెక్ట్స్ వంటి థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ కంపెనీల ద్వారా ఎప్పటికప్పుడు తనిఖీలు, అదే విధంగా సోషల్ ఆడిటింగ్ జరుగుతోంది.
– తొలి దశలో 15,715 స్కూళ్లలో మొత్తం రూ.1690.14 కోట్లతో పనులు జరుగుతున్నాయి.
– స్కూల్లో కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రెండు కేటగిరీలలో కిచెన్ల నిర్మాణం. రూ.5 లక్షలు. రూ.15 లక్షలతో రెండు రకాల కిచెన్లు నిర్మాణం.
– రాష్ట్రంలో 9323 అంగన్వాడీలు స్కూళ్ల భవనాల్లో ఉన్నాయి.
– 5735 ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో రూ.5 లక్షల చొప్పున కిచెన్ షెడ్ల వ్యయం రూ.287 కోట్లు.
– 1668 హైస్కూళ్లలో రూ.15 లక్షల చొప్పున కిచెన్ షెడ్ల వ్యయం రూ.250 కోట్లు.
0 comments:
Post a comment