*🌼మూడో డీఏ 5.24శాతం గా నిర్ణయం*
*మంత్రి మండలి ఆమోదం*
☀️ఉద్యోగులకు 2019 జులై నుంచి పెండింగులో ఉన్న కరవు భత్యం
5.24శాతం మేర చెల్లించాలని రాష్ట్ర
ప్రభుత్వం నిర్ణయించింది.
🎯పెండింగులో
ఉన్న మూడు డీఏలలో తొలి రెండు 3.144శాతంగాను, మూడో డీఏ
5.24శాతంగా రాష్ట్ర మంత్రి మండలి
శుక్రవారం ఆమోదించింది.
☀️మంత్రి
మండలి నిర్ణయాలను వ్యవసాయశాఖ
మంత్రి కురసాల కన్నబాబు విలేకరులకు
చెప్పారు.
🎯తొలి డీఏ అరియర్స్ 30 నెలలవి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.
☀️ 2018
జులై నుంచి ఇవ్వాల్సిన డీఏ అరియర్స్
భారం రూ.3017 కోట్లుగా పేర్కొన్నారు. 2021 జనవరి నుంచి
జీతాలు, పెన్షన్లతో పాటు నగదు రూపంలో చెల్లిస్తామన్నారు.
☀️ఈ డీఏ వల్ల ఏడాదికి ప్రభుత్వంపై భారం రూ.1,206.96 కోట్లు పడుతుందని చెప్పారు.2019 జవనరి నుంచి పెండింగులో ఉన్న డీఏ అమలు వల్ల కూడా ఇదే మొత్తాలు ఖర్చవుతాయని పేర్కొన్నారు.
*☀️2019 జులై నుంచి అమలు చేయాల్సిన
డీఏ 5.24శాతం చొప్పున ఇవ్వాలని
నిర్ణయించినట్లు పేర్కొంటూ అరియర్స్
భారం రూ.5,028.90 కోట్లు పడుతుందన్నారు.
☀️మూడో డీఏ వల్లఏడాదికి ప్రభుత్వానికి రూ.2,011.56
కోట్లు ఖర్చవుతుందని చెప్పారు.
☀️మొత్తం మూడు డీఏల అరియర్స్ భారం
రూ.11 వేల కోట్ల పై మాటే అని
కన్నబాబు చెప్పారు.
0 comments:
Post a comment