Telangana Schools Reopen date: అక్టోబర్ 15 నుంచి విద్యా సంస్థలు తెరుచుకోవచ్చని, దానిపై ఫైనల్ నిర్ణయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర ప్రభుత్వం అన్లాక్ 5.0 మార్గదర్శకాల్లో తెలిపింది. ఆ ప్రకారమే... ఏపీ ప్రభుత్వం నవంబర్ 2 నుంచి స్కూళ్లను తెరవాలని భావిస్తుండగా... తెలంగాణ ప్రభుత్వం కూడా... నవంబర్ 2 నుంచే స్కూళ్లను తెరవాలనుకుంటున్నట్లు తెలిసింది. స్కూళ్లు తెరవాలంటే... ముందు విద్యార్థులు స్కూళ్లకు వచ్చేందుకు సిద్ధపడాలి... విద్యార్థుల ఇష్ట ప్రకారమే... ఇది జరుగుతుందని కేంద్రం తెలిపింది. పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల్ని స్కూళ్లకు పంపేందుకు ముందుకు రావాలి. ఆంధ్రప్రదేశ్లో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు స్కూళ్లను అక్టోబర్ 5 నుంచి తెరవాలనుకున్నారు.
చివరి నిమిషంలో అది వాయిదా పడింది.
ఏపీలో కంటే తక్కువ కరోనా కేసులు నమోదవుతున్న తెలంగాణలో నవంబర్ 2 నుంచి స్కూళ్లను తెరవాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. అంటే... దాదాపు నెల సమయం ఉంది. ఈ నెల రోజుల్లో కరోనా మరింత కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తద్వారా... విద్యార్థులు, తల్లిదండ్రులు... పిల్లల్ని స్కూళ్లకు పంపేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.
స్కూళ్లు, హాస్టళ్లను తెరవడంపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,... బీసీ, ఎస్సీ- మైనార్టీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్లు ఈ నెల 7న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమావేశమై చర్చిస్తారు. ఓ నివేదిక తయారుచేస్తారు. దాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇస్తారు. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే... నవంబరు 2 నుంచి 9, 10 తరగతులతో పాటు జూనియర్ కాలేజీలు, ఇతర కాలేజీలూ తెరవాలని విద్యాశాఖ అనుకుంటున్నట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వం కూడా... ఇదే ఆలోచనతో ఉంది.
చివరి నిమిషంలో అది వాయిదా పడింది.
ఏపీలో కంటే తక్కువ కరోనా కేసులు నమోదవుతున్న తెలంగాణలో నవంబర్ 2 నుంచి స్కూళ్లను తెరవాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. అంటే... దాదాపు నెల సమయం ఉంది. ఈ నెల రోజుల్లో కరోనా మరింత కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తద్వారా... విద్యార్థులు, తల్లిదండ్రులు... పిల్లల్ని స్కూళ్లకు పంపేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.
స్కూళ్లు, హాస్టళ్లను తెరవడంపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,... బీసీ, ఎస్సీ- మైనార్టీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్లు ఈ నెల 7న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమావేశమై చర్చిస్తారు. ఓ నివేదిక తయారుచేస్తారు. దాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇస్తారు. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే... నవంబరు 2 నుంచి 9, 10 తరగతులతో పాటు జూనియర్ కాలేజీలు, ఇతర కాలేజీలూ తెరవాలని విద్యాశాఖ అనుకుంటున్నట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వం కూడా... ఇదే ఆలోచనతో ఉంది.
0 comments:
Post a comment