Corona for 56 students in a school
కరీంనగర్ లో కరోనా కలకలం... ఒకే స్కూళ్లో 56మంది విద్యార్థులకు కరోనా
కరోనా వైరస్ కారణంగా గత ఆరు నెలలుగా మూతపడ్డ విద్యాసంస్థలను తెరిచేందుకు కేంద్రం నుండి అనుమతి లభించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాలోని ఓ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏకంగా 56మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారన్న వార్త అటు అధికారుల్లోనే కాదు ఇటు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళనను రేకెత్తించింది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆరుగురు టీచర్లు, 50మంది విద్యార్థుకు కరోనా సోకింది. కొందరు విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు పాఠశాలలోని మొత్తం 206మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా టెస్టులు నిర్వహించారు.
ఆందులో 56మందికి కరోనా పాజిటివ్ గా తేలినట్లు సమాచారం. అయితే అధికారులు మాత్రం ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ గురుకులంలో చదువుకునే పదవ తరగతి విద్యార్థులతో పాటు ఇంటర్ ఫస్ట్, సెకండియర్ విద్యార్థులకు గత కొద్ది రోజుల నుంచి క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే పిల్లల తల్లిదండ్రులు అభ్యర్థన మేరకే ఈ క్లాసులు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు.
0 comments:
Post a comment