Reopening of schools from October 5 - Cabinet decision??
అక్టోబర్ 5 నుంచి స్కూళ్ళు పున:ప్రారంభం - మంత్రివర్గం సూత్రప్రాయంగా నిర్ణయం
AP Cabinet News: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు అంశాలను చర్చించింది. కొన్ని తీర్మానాలు చేసింది. రైతులకు అందే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమే అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఒక్క కనెక్షన్కూడా తొలగించబోమని, ఉన్న కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తామని తెలిపారు. కనెక్షన్ ఉన్న రైతు పేరు మీద ప్రత్యేక ఖాతా తెరుస్తామని.. ఆ ఖాతాలో ప్రభుత్వం డబ్బులు వేస్తుందని తెలిపారు. ఆ డబ్బును రైతులు డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపారు. మీటర్ల ఖర్చు డిస్కంలు, ప్రభుత్వానిదే అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఆన్ లైన్ రమ్మీ, పోకర్పై నిషేధం విధించాలని నిర్ణయించారు.
ఇకపై ఆన్ లైన్లో ఎవరైతే రమ్మీ, పోకర్ లాంటి జూద క్రీడలను నిర్వహిస్తారో వారికి జరిమానా, శిక్ష విధిస్తారు. ఆన్ లైన్ రమ్మీ, పోకర్ నిర్వహించే వారు మొదటిసారి పట్టుబడితే వారికి ఏడాది పాటు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఒకవేళ రెండో సారి కూడా పట్టుబడితే వారికి రెండేళ్ల జైలు, జరిమానా విధిస్తారు. అలాగే, ఆన్ లైన్లో జూదం ఆడేవారికి కూడా ఆరు నెలల శిక్ష పడుతుంది. దీనికి సంబంధించి జీవో జారీ చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది.ప్రకాశం బ్యారేజీ దిగువన మరో రెండు బ్యారేజీలు నిర్మాణం చేయాలని ఏపీ కేబినెట్ తీర్మానం చేసింది. ఒక్కో బ్యారేజీ 3 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటుంది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం, మంగళగిరి మండలం రామచంద్రాపురం మధ్య రూ.1215 కోట్లతో బ్యారేజీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, మోపిదేవి మండలం బండికోళ్ల లంక, గుంటూరు జిల్లా రేపల్లె మండలం తూర్పుపాలెం మధ్య రూ.1350 కోట్లు వ్యయంతో బ్యారేజీ నిర్మాణం చేయాలని మరో తీర్మానం చేసింది.
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో గొల్లాపల్లి, దుర్గి, వెల్దుర్తి మండలాల్లో సాగు, తాగు నీటి కష్టాలు తీర్చేందుకు వరికపూడి శెల అని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది. అందుకు రూ.1273 కోట్లు ఖర్చవుతుంది. ఉత్తరాంధ్రలో సాగు, తాగు అవసరాలు తీర్చడానికి బాబూ జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల సృవంతి పథకాన్ని రూపొందించనున్నారు. రాయలసీమ కరువు నివారణ పథకం ద్వారా వివిధ నిర్మాణాలు, ఎత్తిపోతల పథకాలు కింద 14 పనులు త్వరగా చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది.
ఏపీ కేబినెట్లో మరికొన్ని తీర్మానాలు
ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన నాడు - నేడు మన బడి, నాడు - నేడు వైద్యం, చేయూత, ఆసరా, అమ్మ ఒడి, రైతు భరోసా కార్యక్రమాలకు ప్లానింగ్, ఫండింగ్, ఫైనాన్సింగ్ కోసం ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు
బాపట్లలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం గుంటూరు జిల్లా మూలపాలెం, జమ్ములపాలెంలో 51 ఎకరాలు కేటాయింపు
ప్రకాశం జిల్లా మార్కాపురంలో మెడికల్ కాలేజీ కోసం రాయవరం రెవిన్యూ గ్రామంలో 47 ఎకరాలు భూమి కేటాయింపు
మావోయిస్టు సంఘాలు, అనుబంధ సంఘాలపై ఏడాది నిషేధం కొనసాగింపు
పశ్చిమ గోదావరి ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని తీర్మానం
అక్టోబర్ 5 నుంచి స్కూళ్ళు పున:ప్రారంభం - మంత్రివర్గం సూత్రప్రాయంగా నిర్ణయం
AP Cabinet News: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు అంశాలను చర్చించింది. కొన్ని తీర్మానాలు చేసింది. రైతులకు అందే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమే అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఒక్క కనెక్షన్కూడా తొలగించబోమని, ఉన్న కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తామని తెలిపారు. కనెక్షన్ ఉన్న రైతు పేరు మీద ప్రత్యేక ఖాతా తెరుస్తామని.. ఆ ఖాతాలో ప్రభుత్వం డబ్బులు వేస్తుందని తెలిపారు. ఆ డబ్బును రైతులు డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపారు. మీటర్ల ఖర్చు డిస్కంలు, ప్రభుత్వానిదే అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఆన్ లైన్ రమ్మీ, పోకర్పై నిషేధం విధించాలని నిర్ణయించారు.
ఇకపై ఆన్ లైన్లో ఎవరైతే రమ్మీ, పోకర్ లాంటి జూద క్రీడలను నిర్వహిస్తారో వారికి జరిమానా, శిక్ష విధిస్తారు. ఆన్ లైన్ రమ్మీ, పోకర్ నిర్వహించే వారు మొదటిసారి పట్టుబడితే వారికి ఏడాది పాటు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఒకవేళ రెండో సారి కూడా పట్టుబడితే వారికి రెండేళ్ల జైలు, జరిమానా విధిస్తారు. అలాగే, ఆన్ లైన్లో జూదం ఆడేవారికి కూడా ఆరు నెలల శిక్ష పడుతుంది. దీనికి సంబంధించి జీవో జారీ చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది.ప్రకాశం బ్యారేజీ దిగువన మరో రెండు బ్యారేజీలు నిర్మాణం చేయాలని ఏపీ కేబినెట్ తీర్మానం చేసింది. ఒక్కో బ్యారేజీ 3 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటుంది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం, మంగళగిరి మండలం రామచంద్రాపురం మధ్య రూ.1215 కోట్లతో బ్యారేజీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, మోపిదేవి మండలం బండికోళ్ల లంక, గుంటూరు జిల్లా రేపల్లె మండలం తూర్పుపాలెం మధ్య రూ.1350 కోట్లు వ్యయంతో బ్యారేజీ నిర్మాణం చేయాలని మరో తీర్మానం చేసింది.
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో గొల్లాపల్లి, దుర్గి, వెల్దుర్తి మండలాల్లో సాగు, తాగు నీటి కష్టాలు తీర్చేందుకు వరికపూడి శెల అని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది. అందుకు రూ.1273 కోట్లు ఖర్చవుతుంది. ఉత్తరాంధ్రలో సాగు, తాగు అవసరాలు తీర్చడానికి బాబూ జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల సృవంతి పథకాన్ని రూపొందించనున్నారు. రాయలసీమ కరువు నివారణ పథకం ద్వారా వివిధ నిర్మాణాలు, ఎత్తిపోతల పథకాలు కింద 14 పనులు త్వరగా చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది.
ఏపీ కేబినెట్లో మరికొన్ని తీర్మానాలు
ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన నాడు - నేడు మన బడి, నాడు - నేడు వైద్యం, చేయూత, ఆసరా, అమ్మ ఒడి, రైతు భరోసా కార్యక్రమాలకు ప్లానింగ్, ఫండింగ్, ఫైనాన్సింగ్ కోసం ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు
బాపట్లలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం గుంటూరు జిల్లా మూలపాలెం, జమ్ములపాలెంలో 51 ఎకరాలు కేటాయింపు
ప్రకాశం జిల్లా మార్కాపురంలో మెడికల్ కాలేజీ కోసం రాయవరం రెవిన్యూ గ్రామంలో 47 ఎకరాలు భూమి కేటాయింపు
మావోయిస్టు సంఘాలు, అనుబంధ సంఘాలపై ఏడాది నిషేధం కొనసాగింపు
పశ్చిమ గోదావరి ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని తీర్మానం
0 comments:
Post a comment