రూ. 2000 నోట్ల ప్రింటింగ్ను ఆపేస్తారని వస్తున్న ఊహాగానాలపై కేంద్రం స్పందించింది. దీనిపై లోక్సభలో క్లారిటీ ఇచ్చింది. రూ .2,000 విలువ కలిగిన కరెన్సీ నోట్ల ముద్రణను నిలిపివేయడంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం లోక్సభకు తెలియజేసింది. ప్రజల లావాదేవీల డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని దీనిపై ఆర్బీఐతో చర్చిస్తామని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. 2019-20, 2020-21 సంవత్సరాల్లో, రూ .2,000 డినామినేషన్ నోట్ల ముద్రణ కోసం ప్రెస్లతో ఎటువంటి ఇండెంట్ ఉంచబడలేదని ఆయన తెలిపారు.
అయితే రూ .2,000 నోట్ల ముద్రణను నిలిపివేసే అంశంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.
మార్చి 31, 2019 నాటికి 32,910 లక్షల నోట్లతో పోల్చితే 2020 మార్చి 31 నాటికి 27,398 లక్షల రూపాయల నోట్లు చెలామణిలో ఉన్నాయని ఠాకూర్ తెలియజేశారు. ఇదిలా ఉంటే 2019-20 సంవత్సరంలో రూ.2,000 విలువ కలిగిన కరెన్సీ నోట్లను ముద్రించలేదని ఆర్బీఐ వార్షిక నివేదికలో తెలిపింది. అసలు ఒక్క నోటును కూడా ప్రింట్ చేయలేదని తెలిపింది. ఇక గత కొన్నేళ్లుగా 2వేల నోట్ల సర్క్యులేషన్ బాగా తగ్గిందని నివేదికలో ఆర్బీఐ పేర్కొంది.
దీంతో రూ. 2 వేల నోట్ల ముద్రణను ప్రభుత్వం ఆపేయనుందనే వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం... ఈ అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.
2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత 2వేల నోటును తీసుకొచ్చింది ఆర్బీఐ. ఆ తర్వాత మూడేళ్ల పాటు బాగానే సర్క్యులేషన్లో ఉన్నాయి. కానీ ఆ తర్వాత నుంచి గులాబీ నోటు పెద్దగా కనిపించడం లేదు. కొందరు బడా వ్యాపారులే 2వేల నోట్లను బ్లాక్ మనీగా దాచి ఉంటారనే ప్రచారం కూడా జరిగింది.
అయితే రూ .2,000 నోట్ల ముద్రణను నిలిపివేసే అంశంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.
మార్చి 31, 2019 నాటికి 32,910 లక్షల నోట్లతో పోల్చితే 2020 మార్చి 31 నాటికి 27,398 లక్షల రూపాయల నోట్లు చెలామణిలో ఉన్నాయని ఠాకూర్ తెలియజేశారు. ఇదిలా ఉంటే 2019-20 సంవత్సరంలో రూ.2,000 విలువ కలిగిన కరెన్సీ నోట్లను ముద్రించలేదని ఆర్బీఐ వార్షిక నివేదికలో తెలిపింది. అసలు ఒక్క నోటును కూడా ప్రింట్ చేయలేదని తెలిపింది. ఇక గత కొన్నేళ్లుగా 2వేల నోట్ల సర్క్యులేషన్ బాగా తగ్గిందని నివేదికలో ఆర్బీఐ పేర్కొంది.
దీంతో రూ. 2 వేల నోట్ల ముద్రణను ప్రభుత్వం ఆపేయనుందనే వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం... ఈ అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.
2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత 2వేల నోటును తీసుకొచ్చింది ఆర్బీఐ. ఆ తర్వాత మూడేళ్ల పాటు బాగానే సర్క్యులేషన్లో ఉన్నాయి. కానీ ఆ తర్వాత నుంచి గులాబీ నోటు పెద్దగా కనిపించడం లేదు. కొందరు బడా వ్యాపారులే 2వేల నోట్లను బ్లాక్ మనీగా దాచి ఉంటారనే ప్రచారం కూడా జరిగింది.
0 comments:
Post a comment