Ganesh Chaturthi: వినాయక చవితిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
మరో మూడు రోజుల్లోనే గణేష్ నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. వినాయక చవితి కోసం ఇప్పటికే చాలా మంది విగ్రహాలను బుక్ చేశారు. మండపాల ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో గణేష్ చతుర్ధి వేడుకలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ ఏడాది బహిరంగ వినాయక మండపాలు, సామూహిక నిమజ్జనానికి అనుమతి లేదని.. ఇళ్లల్లోనే పూజలు చేసుకోవాలని స్పష్టం చేసింది. విగ్రహాలు పొడవుకు 2 అడుగుల కంటే ఎక్కువగా ఉండకూడదని.. ఎక్కడ ప్రతిష్టించారో అక్కడే నిమజ్జనం చేయాలని తెలిపింది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.
బుధవారం మధ్యాహ్నం దేవాదాయశాఖ కార్యాలయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో వినాయక చవితి వేడుకలపై సమీక్షా సమావేశం జరిగింది.
ఆ భేటీలో దేవాదాయశాఖ కమిషనర్ అర్జునరావు, దేవాదాయశాఖ జాయింట్ కమిషనర్ ఆజాద్, హెల్త్ డైరెక్టర్ అరుణ కుమారి, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రాజశేఖర్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. భేటీ అనంతరం మాట్లాడిన మంత్రి వెల్లంపల్లి.. కరోనా పరిస్థితుల దృష్ట్యాల బహిరంగ వినాయక మండపాలు, భారీ గణనాథుల ఏర్పాటు, నదులు, చెరువుల్లో సామూహిక నిమజ్జనానికి అనుమతి లేదని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాయాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వినాయక పూజలు చేసుకోవచ్చని చెప్పారు.
ఊరేగింపులు, లౌడ్ స్పీకర్లు, డీజేలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని.. అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
మరో మూడు రోజుల్లోనే గణేష్ నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. వినాయక చవితి కోసం ఇప్పటికే చాలా మంది విగ్రహాలను బుక్ చేశారు. మండపాల ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో గణేష్ చతుర్ధి వేడుకలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ ఏడాది బహిరంగ వినాయక మండపాలు, సామూహిక నిమజ్జనానికి అనుమతి లేదని.. ఇళ్లల్లోనే పూజలు చేసుకోవాలని స్పష్టం చేసింది. విగ్రహాలు పొడవుకు 2 అడుగుల కంటే ఎక్కువగా ఉండకూడదని.. ఎక్కడ ప్రతిష్టించారో అక్కడే నిమజ్జనం చేయాలని తెలిపింది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.
బుధవారం మధ్యాహ్నం దేవాదాయశాఖ కార్యాలయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో వినాయక చవితి వేడుకలపై సమీక్షా సమావేశం జరిగింది.
ఆ భేటీలో దేవాదాయశాఖ కమిషనర్ అర్జునరావు, దేవాదాయశాఖ జాయింట్ కమిషనర్ ఆజాద్, హెల్త్ డైరెక్టర్ అరుణ కుమారి, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రాజశేఖర్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. భేటీ అనంతరం మాట్లాడిన మంత్రి వెల్లంపల్లి.. కరోనా పరిస్థితుల దృష్ట్యాల బహిరంగ వినాయక మండపాలు, భారీ గణనాథుల ఏర్పాటు, నదులు, చెరువుల్లో సామూహిక నిమజ్జనానికి అనుమతి లేదని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాయాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వినాయక పూజలు చేసుకోవచ్చని చెప్పారు.
ఊరేగింపులు, లౌడ్ స్పీకర్లు, డీజేలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని.. అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
0 comments:
Post a comment