ఇళ్ల పట్టాలపై సీఎం జగన్ సర్కారుకు హైకోర్టులో మరో షాక్...
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలకు చెందిన స్థలాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ తిరుమలగిరిలోని ట్రైబల్ స్కూల్స్ స్థలం ఇళ్ల పట్టాలుగా ఇవ్వటాన్ని తప్పుపడుతూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల స్థలాల్లో భూములను ఇళ్ల పట్టాలుగా ఇవ్వొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అందులో అమరావతి భూములు కూడా ఉన్నాయి. అలాగే, రాష్ట్రంలోని పలు వివాదంలో ఉన్న భూములు కూడా ఉన్నాయి. అమరావతి భూములు, ఇతర భూములకు సంబంధించి పలు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. అమరావతిలో భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా పంచాలన్న జగన్ సర్కారు నిర్ణయంపై అమరావతి రైతులు కోర్టుకు వెళ్లడంతో అక్కడ బ్రేక్ పడింది.
హైకోర్టు నిర్ణయం మీద జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ సర్కారుకు చుక్కెదురైంది. ఇలాంటి సమస్యల నేపథ్యంలో ఇప్పటికి ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడుతూ వస్తోంది. మొదట వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూలై 8న ఇవ్వాలనుకున్నారు. అయితే, కోర్టు కేసుల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇవ్వాలని ప్లాన్ చేశారు. కానీ, మళ్లీ వాయిదా పడింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం ఆలోచిస్తోంది.
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలకు చెందిన స్థలాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ తిరుమలగిరిలోని ట్రైబల్ స్కూల్స్ స్థలం ఇళ్ల పట్టాలుగా ఇవ్వటాన్ని తప్పుపడుతూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల స్థలాల్లో భూములను ఇళ్ల పట్టాలుగా ఇవ్వొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అందులో అమరావతి భూములు కూడా ఉన్నాయి. అలాగే, రాష్ట్రంలోని పలు వివాదంలో ఉన్న భూములు కూడా ఉన్నాయి. అమరావతి భూములు, ఇతర భూములకు సంబంధించి పలు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. అమరావతిలో భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా పంచాలన్న జగన్ సర్కారు నిర్ణయంపై అమరావతి రైతులు కోర్టుకు వెళ్లడంతో అక్కడ బ్రేక్ పడింది.
హైకోర్టు నిర్ణయం మీద జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ సర్కారుకు చుక్కెదురైంది. ఇలాంటి సమస్యల నేపథ్యంలో ఇప్పటికి ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడుతూ వస్తోంది. మొదట వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూలై 8న ఇవ్వాలనుకున్నారు. అయితే, కోర్టు కేసుల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇవ్వాలని ప్లాన్ చేశారు. కానీ, మళ్లీ వాయిదా పడింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం ఆలోచిస్తోంది.
0 comments:
Post a comment