AP Educational Minister Tests Corona Positive: ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో పాటు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సహా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది కోలుకోగా, ఇంకొందరు హోం ఐసోలేషన్లో ఉన్నారు.
ఇక తాజాగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వాట్సాప్ స్టేటస్ ద్వారా వెల్లడించారు. స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటంతో టెస్టులు చేయించుకోగా.. పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్న ఆయన.. డాక్టర్ల పర్యవేక్షణలో ఇంటి దగ్గర నుంచే చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది.
0 Comments:
Post a Comment