ఏపీలో అక్టోబరు 15 నుంచి కాలేజీలు ఓపెన్: జగన్
అమరావతి: రాష్ట్రంలో అక్టోబరు 15న కళాశాలలు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యపై ఆయన సమీక్ష నిర్వహించారు. విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి జగన్ అనుమతి ఇచ్చారు. సెప్టెంబరులో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ను 90శాతానికి తీసుకెళ్లాలని, మూడేళ్ల, నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో 10 నెలల అప్రెంటిస్షిప్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆపై మరో ఏడాది నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన కోర్సులు బోధన జరగాలన్నారు. అక్రమాలకు పాల్పడే కళాశాలలపై కఠినచర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు
అమరావతి: రాష్ట్రంలో అక్టోబరు 15న కళాశాలలు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యపై ఆయన సమీక్ష నిర్వహించారు. విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి జగన్ అనుమతి ఇచ్చారు. సెప్టెంబరులో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ను 90శాతానికి తీసుకెళ్లాలని, మూడేళ్ల, నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో 10 నెలల అప్రెంటిస్షిప్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆపై మరో ఏడాది నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన కోర్సులు బోధన జరగాలన్నారు. అక్రమాలకు పాల్పడే కళాశాలలపై కఠినచర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు
0 comments:
Post a comment