The AP government has made a key decision on corona treatment charges in private hospitals
అమరావతి: రాష్ట్రంలో కొవిడ్ చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేసే ఛార్జీలు, అత్యవసర ఖరీదైన ఔషధాల వినియోగంపై పరిమితులు విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ చికిత్సలో కీలకమైన సైటోకైన్ స్టార్మ్ సిండ్రోమ్ కోసం వినియోగించే టోసిలిజుమాబ్ ఇంజెక్షన్, కోవిడ్ చికిత్సకు వినియోగించే యాంటీ వైరల్ డ్రగ్ రెమ్డెసివిర్ , మెరోపెనామ్ యాంటీ వైరల్ డ్రగ్గా ఉన్న టాబ్లెట్ ఫావిపిరవిర్ లాంటి ఔషధాలను అత్యవసర కేసుల్లో మాత్రమే అదనపు డోసులు వినియోగించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐసీఎంఆర్ సూచించిన ఈ ఔషధాలపై ఉన్న ఎంఆర్పీ రేట్లనే వసూలు చేయాలని సర్కార్ స్పష్టం చేసింది. అవసరం లేకపోయినా ఈ ఔషధాల అదనపు డోసులు వినియోగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అస్పత్రులకు తేల్చిచెప్పింది.
ఊపిరితిత్తుల్లో కోవిడ్ వైరస్ తీవ్రత తెలుసుకునేందుకు వినియోగించే సీటీ స్కాన్కూ గరిష్టంగా రూ.2500 మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. ఆరోగ్యశ్రీ ట్రస్టులో నమోదు అయి ఉన్న ఆస్పత్రులన్నీ ఈ ఔషధాల వినియోగానికి సంబంధించిన ఆధారాలను సమర్పించాలని స్పష్టం చేసింది. ఆరోగ్యశ్రీ కింద నమోదు కాని ఆస్పత్రులు గతంలో ప్రభుత్వం సూచించిన ప్యాకేజీ ధరలకు అదనంగా అందించే చికిత్సను అనుసరించి ఛార్జీలు వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ వచ్చినప్పటికీ ఛాతీ ఎక్స్రే, సీటీ స్కాన్లో ఉన్న మార్పులకు అనుగుణంగా కోవిడ్ పాజిటివ్ రోగిగానే గుర్తించి ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని సూచించించింది.
ఆరోగ్యశ్రీ కింద నమోదు కాని ఆస్పత్రులు కోవిడ్ చికిత్స కోసం రోగుల నుంచి ప్రభుత్వ సూచించిన ధరల కంటే అదనంగా వసూలు చేయకుండా చూడాలని జిల్లా వైద్యశాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో కోవిడ్ క్రిటికల్ కేర్ చికిత్సకు మందులు, పరీక్షలు ఆహారం సహా రోజుకు రూ.5480 నుంచి రూ.10,380 వరకూ నిర్ధారించిన ప్రభుత్వం నాన్ క్రిటికల్ కేర్కు రోజుకు రూ.3250 చొప్పున మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది.
అమరావతి: రాష్ట్రంలో కొవిడ్ చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేసే ఛార్జీలు, అత్యవసర ఖరీదైన ఔషధాల వినియోగంపై పరిమితులు విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ చికిత్సలో కీలకమైన సైటోకైన్ స్టార్మ్ సిండ్రోమ్ కోసం వినియోగించే టోసిలిజుమాబ్ ఇంజెక్షన్, కోవిడ్ చికిత్సకు వినియోగించే యాంటీ వైరల్ డ్రగ్ రెమ్డెసివిర్ , మెరోపెనామ్ యాంటీ వైరల్ డ్రగ్గా ఉన్న టాబ్లెట్ ఫావిపిరవిర్ లాంటి ఔషధాలను అత్యవసర కేసుల్లో మాత్రమే అదనపు డోసులు వినియోగించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐసీఎంఆర్ సూచించిన ఈ ఔషధాలపై ఉన్న ఎంఆర్పీ రేట్లనే వసూలు చేయాలని సర్కార్ స్పష్టం చేసింది. అవసరం లేకపోయినా ఈ ఔషధాల అదనపు డోసులు వినియోగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అస్పత్రులకు తేల్చిచెప్పింది.
ఊపిరితిత్తుల్లో కోవిడ్ వైరస్ తీవ్రత తెలుసుకునేందుకు వినియోగించే సీటీ స్కాన్కూ గరిష్టంగా రూ.2500 మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. ఆరోగ్యశ్రీ ట్రస్టులో నమోదు అయి ఉన్న ఆస్పత్రులన్నీ ఈ ఔషధాల వినియోగానికి సంబంధించిన ఆధారాలను సమర్పించాలని స్పష్టం చేసింది. ఆరోగ్యశ్రీ కింద నమోదు కాని ఆస్పత్రులు గతంలో ప్రభుత్వం సూచించిన ప్యాకేజీ ధరలకు అదనంగా అందించే చికిత్సను అనుసరించి ఛార్జీలు వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ వచ్చినప్పటికీ ఛాతీ ఎక్స్రే, సీటీ స్కాన్లో ఉన్న మార్పులకు అనుగుణంగా కోవిడ్ పాజిటివ్ రోగిగానే గుర్తించి ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని సూచించించింది.
ఆరోగ్యశ్రీ కింద నమోదు కాని ఆస్పత్రులు కోవిడ్ చికిత్స కోసం రోగుల నుంచి ప్రభుత్వ సూచించిన ధరల కంటే అదనంగా వసూలు చేయకుండా చూడాలని జిల్లా వైద్యశాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో కోవిడ్ క్రిటికల్ కేర్ చికిత్సకు మందులు, పరీక్షలు ఆహారం సహా రోజుకు రూ.5480 నుంచి రూ.10,380 వరకూ నిర్ధారించిన ప్రభుత్వం నాన్ క్రిటికల్ కేర్కు రోజుకు రూ.3250 చొప్పున మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది.
0 Comments:
Post a Comment