నాడు–నేడు ప్రభుత్వానికి టాప్ ప్రయార్టీ
మొదటి విడత నాడు–నేడులో 15 వేల స్కూళ్లలో అభివృద్ధి
దీని కోసం దాదాపు రూ.3600 కోట్లు ఖర్చు
పలు సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి : ఏడాదిన్నరలోగా విద్యారంగంలో నాడు-నేడు పనులు పూర్తి కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు, సాగునీటి ప్రాజెక్టులు, వాటర్గ్రిడ్, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు నిధుల అనుసంధానంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్న వీటి విషయంలో ఎక్కడా నిధులకు కొరత రాకుండా పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. నిధుల అనుసంధానంపై నిర్దిష్ట సమయంతో లక్ష్యాలను పెట్టుకుని ఖచ్చితమైన ప్రణాళికతో అడుగులు ముందుకేయాలని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలోగా లక్ష్యాలు, అంతే వేగంతో పనులు జరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నాడు-నేడు కార్యక్రమం ప్రభుత్వానికి అత్యంత ప్రధానమని వైఎస్ జగన్ అన్నారు.
విద్యారంగంలో నాడు-నేడు
విద్యారంగంలో నాడు-నేడు పనులకు ఇప్పటి వరకు విడుదల చేసిన నిధులు, ఇకపై సమీకరించాల్సిన నిధుల అంశాలపై సీఎం అధికారులకు మార్గనిర్దేశం చేశారు. మొదటి విడత నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా 15 వేలకు పైగా స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, దీని కోసం దాదాపు రూ.3600 కోట్లు ఖర్చు అవుతుందని, ఇప్పటికి రూ.920 కోట్లు విడుదలయ్యాయని వెల్లడించారు. మిగిలిన నిధుల విడుదల కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి మొదటి విడత నాడు–నేడు కార్యక్రమాలకు మిగిలిన నిధులు ఇచ్చేందుకు ప్రణాళిక వేసుకోవాలన్నారు. అలాగే పాఠశాలలు సహా, హాస్టళ్లు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో రెండు, మూడో విడత నాడు–నేడు కార్యక్రమాల కోసం రూ.7700 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశామని అధికారులు సీఎంకు తెలిపారు.
ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్న పాఠశాలలు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమాలకు.. నిధుల పరంగా ఇబ్బందులు రాకుండా, పటిష్టంగా ఈ కార్యక్రమం కొనసాగాలని వైఎస్ జగన్ ఆదేశించారు. ఏడాదిన్నర కాలంలో పాఠశాలల అభివృద్ధి విషయంలో మనం కన్న కలలు నిజం కావాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్యారంగంలో నాడు-నేడు పనులపై తాము కన్న కల నిజం కావాలని అధికారులకు ముఖ్యమంతి సూచించారు. ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో కూడా నాడు-నేడు, కొత్తగా నిర్మించే నిర్మాణాలు అత్యంత ముఖ్యమైనదన్నారు. అక్టోబర్ 1 నుంచి రాయలసీమ కరువు నివారణా పనులు ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
మొదటి విడత నాడు–నేడులో 15 వేల స్కూళ్లలో అభివృద్ధి
దీని కోసం దాదాపు రూ.3600 కోట్లు ఖర్చు
పలు సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి : ఏడాదిన్నరలోగా విద్యారంగంలో నాడు-నేడు పనులు పూర్తి కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు, సాగునీటి ప్రాజెక్టులు, వాటర్గ్రిడ్, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు నిధుల అనుసంధానంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్న వీటి విషయంలో ఎక్కడా నిధులకు కొరత రాకుండా పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. నిధుల అనుసంధానంపై నిర్దిష్ట సమయంతో లక్ష్యాలను పెట్టుకుని ఖచ్చితమైన ప్రణాళికతో అడుగులు ముందుకేయాలని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలోగా లక్ష్యాలు, అంతే వేగంతో పనులు జరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నాడు-నేడు కార్యక్రమం ప్రభుత్వానికి అత్యంత ప్రధానమని వైఎస్ జగన్ అన్నారు.
విద్యారంగంలో నాడు-నేడు
విద్యారంగంలో నాడు-నేడు పనులకు ఇప్పటి వరకు విడుదల చేసిన నిధులు, ఇకపై సమీకరించాల్సిన నిధుల అంశాలపై సీఎం అధికారులకు మార్గనిర్దేశం చేశారు. మొదటి విడత నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా 15 వేలకు పైగా స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, దీని కోసం దాదాపు రూ.3600 కోట్లు ఖర్చు అవుతుందని, ఇప్పటికి రూ.920 కోట్లు విడుదలయ్యాయని వెల్లడించారు. మిగిలిన నిధుల విడుదల కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి మొదటి విడత నాడు–నేడు కార్యక్రమాలకు మిగిలిన నిధులు ఇచ్చేందుకు ప్రణాళిక వేసుకోవాలన్నారు. అలాగే పాఠశాలలు సహా, హాస్టళ్లు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో రెండు, మూడో విడత నాడు–నేడు కార్యక్రమాల కోసం రూ.7700 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశామని అధికారులు సీఎంకు తెలిపారు.
ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్న పాఠశాలలు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమాలకు.. నిధుల పరంగా ఇబ్బందులు రాకుండా, పటిష్టంగా ఈ కార్యక్రమం కొనసాగాలని వైఎస్ జగన్ ఆదేశించారు. ఏడాదిన్నర కాలంలో పాఠశాలల అభివృద్ధి విషయంలో మనం కన్న కలలు నిజం కావాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్యారంగంలో నాడు-నేడు పనులపై తాము కన్న కల నిజం కావాలని అధికారులకు ముఖ్యమంతి సూచించారు. ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో కూడా నాడు-నేడు, కొత్తగా నిర్మించే నిర్మాణాలు అత్యంత ముఖ్యమైనదన్నారు. అక్టోబర్ 1 నుంచి రాయలసీమ కరువు నివారణా పనులు ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
0 Comments:
Post a Comment