DRDO Scholarship : అమ్మాయిలకు గుడ్ న్యూస్ ... డీఆర్డీఓ నుంచి రూ .1,86,000 స్కాలర్షిప్.
విద్యార్థినులకు శుభవార్త. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్-DRDO ప్రతీ ఏడాది లాగే ఈసారి కూడా స్కాలర్షిప్స్ ప్రకటించింది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, స్పేస్ ఇంజనీరింగ్, రాకెట్రీ, ఏవియానిక్స్, ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీరింగ్ విభాగాల్లో చదువుతున్న అమ్మాయిలు ఈ స్కాలర్షిప్స్కు దరఖాస్తు చేయొచ్చు. 30 మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్స్ అందిస్తోంది డీఆర్డీఓ. ఎంపికైన అమ్మాయిలకు ఏటా రూ.1,86,000 వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. ఆసక్తి గల విద్యార్థినులు డీఆర్డీఓకు చెందిన రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్-RAC వెబ్సైట్ https://rac.gov.in/ లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 19న ప్రారంభం కానుంది.
దరఖాస్తు చేయడానికి డిసెంబర్ 30 చివరి తేదీ. భారతదేశానికి చెందిన అమ్మాయిలు మాత్రమే ఈ స్కాలర్షిప్స్కు అప్లై చేయాలి.
బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయిలకు 20 స్కాలర్షిప్స్ కేటాయించింది డీఆర్డీఓ. JEE (Main) స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతున్న అమ్మాయిలకు 10 కేటాయించింది డీఆర్డీఓ. గ్రాడ్యుయేషన్లో కనీసం 60% మార్కులతో పాటు గేట్ స్కోర్ ఉండాలి. ఎంపికైనవారికి వార్షిక కాలేజీ ఫీజు లేదా రూ.1,86,000 వరకు స్కాలర్షిప్ రూపంలో అందిస్తుంది డీఆర్డీఓ. బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ విద్యార్థినులు ఏటా రూ.1,20,000 వరకు నాలుగేళ్లు, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఇంజనీరింగ్ విద్యార్థినులు ఏటా రూ.1,86,000 వరకు రెండేళ్లు స్కాలర్షిప్ పొందొచ్చు.
విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అడ్మిషన్ పొంది ఉండాలి. స్కాలర్షిప్ కోసం ఎంపికైనవాళ్లు డీఆర్డీఓ, ప్రభుత్వ ల్యాబరేటరీస్ లేదా AR&DB నిధులతో నడుస్తున్న సంస్థల్లో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. స్కాలర్షిప్కు అర్హత సాధించిన విద్యార్థినులు అన్ని పరీక్షల్లో పాస్ కావాలి.
విద్యార్థినులకు శుభవార్త. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్-DRDO ప్రతీ ఏడాది లాగే ఈసారి కూడా స్కాలర్షిప్స్ ప్రకటించింది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, స్పేస్ ఇంజనీరింగ్, రాకెట్రీ, ఏవియానిక్స్, ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీరింగ్ విభాగాల్లో చదువుతున్న అమ్మాయిలు ఈ స్కాలర్షిప్స్కు దరఖాస్తు చేయొచ్చు. 30 మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్స్ అందిస్తోంది డీఆర్డీఓ. ఎంపికైన అమ్మాయిలకు ఏటా రూ.1,86,000 వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. ఆసక్తి గల విద్యార్థినులు డీఆర్డీఓకు చెందిన రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్-RAC వెబ్సైట్ https://rac.gov.in/ లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 19న ప్రారంభం కానుంది.
దరఖాస్తు చేయడానికి డిసెంబర్ 30 చివరి తేదీ. భారతదేశానికి చెందిన అమ్మాయిలు మాత్రమే ఈ స్కాలర్షిప్స్కు అప్లై చేయాలి.
బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయిలకు 20 స్కాలర్షిప్స్ కేటాయించింది డీఆర్డీఓ. JEE (Main) స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతున్న అమ్మాయిలకు 10 కేటాయించింది డీఆర్డీఓ. గ్రాడ్యుయేషన్లో కనీసం 60% మార్కులతో పాటు గేట్ స్కోర్ ఉండాలి. ఎంపికైనవారికి వార్షిక కాలేజీ ఫీజు లేదా రూ.1,86,000 వరకు స్కాలర్షిప్ రూపంలో అందిస్తుంది డీఆర్డీఓ. బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ విద్యార్థినులు ఏటా రూ.1,20,000 వరకు నాలుగేళ్లు, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఇంజనీరింగ్ విద్యార్థినులు ఏటా రూ.1,86,000 వరకు రెండేళ్లు స్కాలర్షిప్ పొందొచ్చు.
విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అడ్మిషన్ పొంది ఉండాలి. స్కాలర్షిప్ కోసం ఎంపికైనవాళ్లు డీఆర్డీఓ, ప్రభుత్వ ల్యాబరేటరీస్ లేదా AR&DB నిధులతో నడుస్తున్న సంస్థల్లో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. స్కాలర్షిప్కు అర్హత సాధించిన విద్యార్థినులు అన్ని పరీక్షల్లో పాస్ కావాలి.
B.tech final year also eligible for this notification?
ReplyDelete