తన రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో నేపాల్ ప్రధానమంత్రి కే పీ శర్మ ఓలి శనివారం కీలక సమావేశాలు జరిపారు. తొలుత నేపాల్ రాష్ట్రపతి బైద్యదేవీ భండారీతో భేటీ అయిన ఓలి.. అనంతరం తన మంత్రులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో తనను గద్దె దించడానికి కుట్ర జరుగుతోందని.. అందువల్ల అందరూ దేనికైనా సిద్ధంగా ఉండాలని మంత్రులకు ఓలి తెలిపినట్టు సమాచారం.
భారత్తో సరిహద్దు వివాదం నేపథ్యంలో ఓలి వైఖరిపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తనపై భారత్ కుట్ర పన్నుతోందన్న ఓలి ఆరోపణలతో.. సొంత పార్టీ నుంచే ప్రధానికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ప్రధాని రాజీనామాకు పార్టీ సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఓలి భవితవ్యాన్ని తేల్చడానికి అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ శనివారం భేటీకావాల్సి ఉంది.కాని కొన్ని కారణలాతో సమవేశం సోమవారానికి వాయిదా పడింది.
భారత్తో సరిహద్దు వివాదం నేపథ్యంలో ఓలి వైఖరిపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తనపై భారత్ కుట్ర పన్నుతోందన్న ఓలి ఆరోపణలతో.. సొంత పార్టీ నుంచే ప్రధానికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ప్రధాని రాజీనామాకు పార్టీ సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఓలి భవితవ్యాన్ని తేల్చడానికి అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ శనివారం భేటీకావాల్సి ఉంది.కాని కొన్ని కారణలాతో సమవేశం సోమవారానికి వాయిదా పడింది.
0 Comments:
Post a Comment