జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్(జేఈఈ) మెయిన్స్, నేషనల్ ఎలిజబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్(నీట్) పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. జేఈఈ అడ్వాన్స్ను సైతం వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. నిపుణుల బృందం సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.
కోవిడ్-19 మహమ్మారి ప్రస్తుత పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం వెలువరించినట్లు ఆయన తెలిపారు. నీట్ పరీక్ష సెప్టెంబర్ 13వ తేదీకి వాయిదా పడగా, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష సెప్టెంబర్ 27వ తేదీకి వాయిదా పడింది.
కోవిడ్-19 మహమ్మారి ప్రస్తుత పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం వెలువరించినట్లు ఆయన తెలిపారు. నీట్ పరీక్ష సెప్టెంబర్ 13వ తేదీకి వాయిదా పడగా, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష సెప్టెంబర్ 27వ తేదీకి వాయిదా పడింది.
0 Comments:
Post a Comment