ఆంధ్రప్రదేశ్లో ఇసుక వినియోగదారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది.
పేదలు, ప్రభుత్వ ప్యాకేజీల వంటి పనులకు ఇసుకను రవాణా చేసే ట్రాక్టర్లకు..
ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా నుంచి మినహాయింపు ఇచ్చింది.
ఇప్పటి వరకు ట్రాక్టర్ ఇసుకకు చలానాగా రూ.1,300లు, లోడింగ్ చార్జీలు రూ.800లు, రవాణా చార్జీ రూ.1,000 నుంచి రూ.1,500లు కలుపుకొని మొత్తం రూ.3,500 నుంచి రూ.4,000 వరకు వసూలు చేసేవారు.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో వినియోగదారులకు ట్రాక్టర్కు రూ.1,300 భారం తగ్గనుంది.
ఇసుక కోసం వినియోగదారుడు గ్రామ సచివాలయంలో తన చిరునామాతో అనెక్సర్-1లో దరఖాస్తు చేసుకోవాలి.
ప్రతి వ్యక్తి అర్జీని 24 గంటల్లో పరిశీలించి అనెక్సర్-2లో పర్మిట్(సమయం, తేదీలతో)ను ఇస్తారు. రీచ్ నుంచి 20కి.మీ పరిధిలో మాత్రమే అనుమతిస్తారు.
రవాణా చేసుకునే సమయంలో సచివాలయం ఇచ్చిన పర్మిట్ కచ్చితంగా ఉండాలి. నోటిఫై చేసిన రీచ్ల నుంచి మాత్రమే ఇసుక తరలించాలి.
ఇసుక పక్కదారి పట్టకుండా గ్రామ కార్యదర్శి పర్యవేక్షించాలి.
0 Comments:
Post a Comment