ఏపీలో జగన్ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త చెప్పింది. సన్న, చిన్నకారు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం "వైఎస్సార్ రైతు భరోసా" అనే పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా ఈ పథకం అమలుకు సంబంధించిన ఉత్తర్వులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం జారీచేశారు. కార్యక్రమంలో భాగంగా సన్న, చిన్నకారు రైతులకు ఫ్రీ గా బోర్ వెల్స్ ను అమలు చేయనున్నారు. బోర్ వెల్ వేసే ముందు రైతు పొలంలో హైడ్రో-జియోలాజికల్, జియోఫిజికల్ సర్వే నిర్వహిస్తారు. భూగర్భ జలాలు తక్కువ స్థాయిలో ఉన్న 1,094 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకాన్ని అమలుచేయరు. అయితే ఈ పథకం అమలుకు కొన్ని అర్హతలను కూడా నిర్దేశించారు.
అర్హతలు, విధివిధానాలు..
► రైతుకు కనీసం 2.5 ఎకరాల భూమి ఉండాలి. అంత భూమి లేకపోతే పక్కనున్న రైతులతో కలిసి గ్రూపుగా ఏర్పడవచ్చు. ఒక రైతుకు గరిష్టంగా 5 ఎకరాల లోపు భూమి ఉండవచ్చు. ఈ అర్హతలు ఉన్న రైతులు బోరు బావి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అంతకు ముందు ఆ భూమిలో ఎలాంటి బోరు బావి నిర్మాణం చేపట్టి ఉండకూడదు.
► అర్హత కలిగిన లబ్ధిదారుడు పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు కాపీతో గ్రామ సచివాలయంలో లేదా నేరుగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
► పంచాయతీ కార్యదర్శి క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం తదుపరి అనుమతికి ఎంపీడీవోకు ఆ దరఖాస్తు వెళుతుంది. జిల్లా మొత్తంలో ఎంపిక చేసిన రైతుల జాబితాలను డ్వామా పీడీలకు ఎంపీడీవోలు అందజేస్తారు.
► బోరు బావి మంజూరు అనంతరం ఆ çసమాచారాన్ని గ్రామ సచివాలయం ద్వారా రైతుకు తెలియజేస్తారు.
0 Comments:
Post a Comment