ఇప్పుడే ఏపీ గవర్నర్కు సూచించలేం: సుప్రీం
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్ నియామకం కేసు
విచారణ మూడు వారాలు వాయిదా
దిల్లీ: నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ ఎలక్షన్ కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ పునర్నియామకం చెల్లదంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాలతో అధికారులూ విధులు నిర్వర్తించలేక పోతున్నారు. మధ్యంతరంగా ఎస్ఈసీని నియమించేలా గవర్నర్కు సూచించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గవర్నర్కు ఇప్పుడు సూచన చేయలేం. రెండు నుంచి మూడు వారాల్లో విచారణ ముగించాలని భావిస్తున్నాం. ఎన్నికల నిర్వహణపై మాట్లాడదలచుకోలేదు అని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు సుప్రీం వాయిదా వేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను పునర్నియమించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్ నియామకం కేసు
విచారణ మూడు వారాలు వాయిదా
దిల్లీ: నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ ఎలక్షన్ కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ పునర్నియామకం చెల్లదంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాలతో అధికారులూ విధులు నిర్వర్తించలేక పోతున్నారు. మధ్యంతరంగా ఎస్ఈసీని నియమించేలా గవర్నర్కు సూచించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గవర్నర్కు ఇప్పుడు సూచన చేయలేం. రెండు నుంచి మూడు వారాల్లో విచారణ ముగించాలని భావిస్తున్నాం. ఎన్నికల నిర్వహణపై మాట్లాడదలచుకోలేదు అని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు సుప్రీం వాయిదా వేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను పునర్నియమించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
0 Comments:
Post a Comment