నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. ఆయనను ఎస్ఈసీగా కొనసాగించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఏపీ హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. హైకోర్టు ఆదేశాల మేరకు రెండు రోజుల క్రితం నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గవర్నర్ను కలిసి తనను మళ్లీ ఏపీ ఎస్ఈసీగా నియమించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో గవర్నర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఏపీ గవర్నర్ స్పష్టం చేయడంతో... ఈ అంశంలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందన్నది ఉత్కంఠగా మారింది.
ఈ అంశంలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను తిరిగి ఎస్ఈసీగా నియమించే విషయంలో సుముఖంగా లేని జగన్ సర్కార్... రెండో రోజుల క్రితమే ఈ అంశంపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్పై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది జగన్ సర్కార్.
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్లో ఉండగా కోర్టు ధిక్కరణ పిటిషన్పై హైకోర్టు విచారణ జరపడం సరికాదని ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. - హైకోర్టు ఆదేశాలను అమలుచేస్తే సుప్రీంకోర్టులో తాము దాఖలు చేసిన పిటిషన్ నిరర్ధకం అవుతుందని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. ఇలాంటి సమయంలో కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు ముందుకెళ్లడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో తాజాగా గవర్నర్ ఆదేశాల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఏపీ గవర్నర్ స్పష్టం చేయడంతో... ఈ అంశంలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందన్నది ఉత్కంఠగా మారింది.
ఈ అంశంలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను తిరిగి ఎస్ఈసీగా నియమించే విషయంలో సుముఖంగా లేని జగన్ సర్కార్... రెండో రోజుల క్రితమే ఈ అంశంపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్పై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది జగన్ సర్కార్.
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్లో ఉండగా కోర్టు ధిక్కరణ పిటిషన్పై హైకోర్టు విచారణ జరపడం సరికాదని ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. - హైకోర్టు ఆదేశాలను అమలుచేస్తే సుప్రీంకోర్టులో తాము దాఖలు చేసిన పిటిషన్ నిరర్ధకం అవుతుందని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. ఇలాంటి సమయంలో కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు ముందుకెళ్లడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో తాజాగా గవర్నర్ ఆదేశాల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
0 Comments:
Post a Comment