ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా నేపథ్యంలో రోడ్ టాక్స్ కట్టేందుకు గతంలో ఇచ్చిన సమయం నేటితో ముగియనున్న సంగతి తెలిసిందే. గత కరోనా కారణంగా గత నాలుగు నెలలుగా వాహనాలు రోడ్డెక్కని పరిస్థితి నెలకొన్నది. దీంతో వాహనదారులు తమ గోడును మంత్రి పేర్ని నానితో చెప్పుకున్నారు. కాగా, మంత్రి నాని ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జగన్ సానుకూలంగా స్పందించి, రోడ్ టాక్స్ ను గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు ఇవ్వనుంది ప్రభుత్వం.
లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం మోటార్ వాహనాల టాక్స్ చెల్లించేందుకు గ్రేస్ పీరియడ్ ను ప్రభుత్వం ఏప్రిల్ 30 నుంచి జూన్ 30 వరకు పెంచిన సంగతి తెలిసిందే.
అయితే, కరోనా మహమ్మారి కారణంగా వాహనాలు రోడ్డెక్కడం లేదు. దీంతో ఇప్పుడు మరోమారు ప్రభుత్వం చెల్లింపులకు సంబంధించిన గడువును మరోమారు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
0 comments:
Post a comment