A virologist has announced that the Chinese government is aware of the coronavirus virus's break-even. Dr. Lee-Meng Yan, a virologist, revealed that he knew how to subdue anyone who knew about any information, and that he fled to America knowing this. She specializes in virology and immunology at the Hong Kong School of Public Health.
కరోనా వైరస్ ఔట్ బ్రేక్ గురించి చైనా ప్రభుత్వానికి తెలిసినప్పటికీ దాచిపెట్టిందని ఓ వైరాలజిస్ట్ ప్రకటించారు. ఏ సమాచారం గురించి తెలిసినవారినైనా ఎలా అణగదొక్కాలో వారికి తెలుసునని, ఇది తెలిసే తాను అమెరికాకు పారిపోయాయని డా.లీ-మెంగ్ యాన్ అనే ఈ వైరాలజిస్ట్ వెల్లడించారు. హాంకాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో వైరాలజీ, ఇమ్యునాలజీలో స్పెషలైజ్ చేసిన ఈమె.. ఫాక్స్ న్యూస్ కి సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ వైరస్ ఔట్ బ్రేక్ పై తను చేసిన రీసెర్చ్ ని కొందరు ఉన్నత స్థాయి నిపుణులే నిర్లక్ష్యం చేశారని ఆమె ఆరోపించింది. ఈ వైరస్ గురించి బీజింగ్ నాయకత్వానికి ముందే తెలుసు.. నా పరిశోధనలు చివరికి కోవిడ్-19 వివరాలు బయటి ప్రపంచానికి తెలిసేందుకు దోహదం చేశాయి అని లీ మెంగ్ యాన్ పేర్కొంది.
తన రీసెర్చ్ అనేకమందిని రక్షించి ఉండవచ్చునని, కానీ 'కొందరి' కారణంగా అలా జరగలేదని ఆమె వాపోయింది. తన పరిశోధనా ఫలితాలను ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రాణాలకు తెగించి అమెరికాకు పారిపోయి వచ్చానని ఆమె పేర్కొంది. హాంకాంగ్ కి తిరిగి రాలేనని కూడా భయపడ్డానని చెప్పింది.
ఇన్ ఫ్లూయెంజా వైరస్ లు, పాండమిక్స్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు 'రెఫరెన్స్ ల్యాబ్' గా స్పెషాలిటీని కలిగిఉన్న చైనాకు ఈ విషయాన్ని తెలియజేయాల్సిన బాధ్యత ఉందని, అదే సమయంలో ఆ సంస్థను నేను అలర్ట్ చేయబోయినా ఫలితం లేకపోయిందని, వారు ఎలాంటి చర్యా తీసుకోలేదని లీ-మెంగ్ యాన్ విమర్శించింది. అసలు ఈ వైరస్ గురించి స్టడీ చేసింది మొదట నేనే ! దాన్నే ఆ తరువాత కోవిడ్-19 గా వ్యవహరించారు.. అని ఆమె స్పష్టంగా పేర్కొంది. గత ఏడాది డిసెంబరులోనే యూనివర్సిటీ లోని తమ సూపర్ వైజర్ డా.లియో పూన్.. చైనాలో సార్స్ వంటి కేసులున్నాయా అని ప్రశ్నించారట.. కాగా- హాంకాంగ్ తో బాటు అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని రప్పించేందుకు చైనా ప్రభుత్వం నిరాకరించిందని, ఇక్కడే రీసెర్చ్ జరగాలని కోరిందని ఆమె తెలిపింది.
మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్ గురించి డిసెంబరు 31 న నా ఫ్రెండ్ నాకు స్పష్టంగా తెలిపింది. అదే రోజున 27 న్యుమోనియా క్లస్టర్ కేసులు వూహాన్ లో బయటపడ్డాయి అని వెల్లడించిన ఆమె.. తన స్నేహితురాలు చెప్పిన విషయాన్నీ, తన తదనంతర పరిశోధనా ఫలితాలను సీనియర్ నిపుణుడికి తెలియజేయగా.. 'నీ రీసెర్చ్ నువ్వు చూసుకో' అని దురుసుగా మాట్లాడాడని వెల్లడించింది. 'రెడ్ లైన్ ముట్టకు.. మనం చిక్కుల్లో పడతాం.. కనుమరుగైపోతాం' అని ఆయన చీవాట్లు పెట్టినంత పని చేశాడట.
ప్రస్తుతం దాదాపు అజ్ఞాతంలో ఉన్న లీ.. తనకు ప్రాణహాని ఉందని భయపడుతోంది. తనపై సైబర్ దాడులు జరగవచ్చునన్న ఆందోళనను వ్యక్తం చేసింది. తన కుటుంబ సభ్యులకు కూడా హాని తలపెట్టవచ్ఛు అని కూడా అనుమానం వ్యక్తం చేసింది. కాగా-హాంకాంగ్ యూనివర్సిటీ తమ వెబ్ సైట్ పేజ్ లో… లీ-మెంగ్ యాన్ పేరును తొలగిస్తూ.. ఆమె తమ స్టాఫ్ సభ్యురాలు కాదని పేర్కొంది. కరోనా వైరస్ ఆవిర్భావానికి చైనాయే కారణమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదేపనిగా ఆరోపిస్తున్న వేళ.. ఈ వైరాలజిస్ట్ ఇఛ్చిన ఇంటర్వ్యూ అత్యధిక ప్రాధాన్యం సంతరించుకుంది.
కరోనా వైరస్ ఔట్ బ్రేక్ గురించి చైనా ప్రభుత్వానికి తెలిసినప్పటికీ దాచిపెట్టిందని ఓ వైరాలజిస్ట్ ప్రకటించారు. ఏ సమాచారం గురించి తెలిసినవారినైనా ఎలా అణగదొక్కాలో వారికి తెలుసునని, ఇది తెలిసే తాను అమెరికాకు పారిపోయాయని డా.లీ-మెంగ్ యాన్ అనే ఈ వైరాలజిస్ట్ వెల్లడించారు. హాంకాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో వైరాలజీ, ఇమ్యునాలజీలో స్పెషలైజ్ చేసిన ఈమె.. ఫాక్స్ న్యూస్ కి సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ వైరస్ ఔట్ బ్రేక్ పై తను చేసిన రీసెర్చ్ ని కొందరు ఉన్నత స్థాయి నిపుణులే నిర్లక్ష్యం చేశారని ఆమె ఆరోపించింది. ఈ వైరస్ గురించి బీజింగ్ నాయకత్వానికి ముందే తెలుసు.. నా పరిశోధనలు చివరికి కోవిడ్-19 వివరాలు బయటి ప్రపంచానికి తెలిసేందుకు దోహదం చేశాయి అని లీ మెంగ్ యాన్ పేర్కొంది.
తన రీసెర్చ్ అనేకమందిని రక్షించి ఉండవచ్చునని, కానీ 'కొందరి' కారణంగా అలా జరగలేదని ఆమె వాపోయింది. తన పరిశోధనా ఫలితాలను ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రాణాలకు తెగించి అమెరికాకు పారిపోయి వచ్చానని ఆమె పేర్కొంది. హాంకాంగ్ కి తిరిగి రాలేనని కూడా భయపడ్డానని చెప్పింది.
ఇన్ ఫ్లూయెంజా వైరస్ లు, పాండమిక్స్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు 'రెఫరెన్స్ ల్యాబ్' గా స్పెషాలిటీని కలిగిఉన్న చైనాకు ఈ విషయాన్ని తెలియజేయాల్సిన బాధ్యత ఉందని, అదే సమయంలో ఆ సంస్థను నేను అలర్ట్ చేయబోయినా ఫలితం లేకపోయిందని, వారు ఎలాంటి చర్యా తీసుకోలేదని లీ-మెంగ్ యాన్ విమర్శించింది. అసలు ఈ వైరస్ గురించి స్టడీ చేసింది మొదట నేనే ! దాన్నే ఆ తరువాత కోవిడ్-19 గా వ్యవహరించారు.. అని ఆమె స్పష్టంగా పేర్కొంది. గత ఏడాది డిసెంబరులోనే యూనివర్సిటీ లోని తమ సూపర్ వైజర్ డా.లియో పూన్.. చైనాలో సార్స్ వంటి కేసులున్నాయా అని ప్రశ్నించారట.. కాగా- హాంకాంగ్ తో బాటు అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని రప్పించేందుకు చైనా ప్రభుత్వం నిరాకరించిందని, ఇక్కడే రీసెర్చ్ జరగాలని కోరిందని ఆమె తెలిపింది.
మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్ గురించి డిసెంబరు 31 న నా ఫ్రెండ్ నాకు స్పష్టంగా తెలిపింది. అదే రోజున 27 న్యుమోనియా క్లస్టర్ కేసులు వూహాన్ లో బయటపడ్డాయి అని వెల్లడించిన ఆమె.. తన స్నేహితురాలు చెప్పిన విషయాన్నీ, తన తదనంతర పరిశోధనా ఫలితాలను సీనియర్ నిపుణుడికి తెలియజేయగా.. 'నీ రీసెర్చ్ నువ్వు చూసుకో' అని దురుసుగా మాట్లాడాడని వెల్లడించింది. 'రెడ్ లైన్ ముట్టకు.. మనం చిక్కుల్లో పడతాం.. కనుమరుగైపోతాం' అని ఆయన చీవాట్లు పెట్టినంత పని చేశాడట.
ప్రస్తుతం దాదాపు అజ్ఞాతంలో ఉన్న లీ.. తనకు ప్రాణహాని ఉందని భయపడుతోంది. తనపై సైబర్ దాడులు జరగవచ్చునన్న ఆందోళనను వ్యక్తం చేసింది. తన కుటుంబ సభ్యులకు కూడా హాని తలపెట్టవచ్ఛు అని కూడా అనుమానం వ్యక్తం చేసింది. కాగా-హాంకాంగ్ యూనివర్సిటీ తమ వెబ్ సైట్ పేజ్ లో… లీ-మెంగ్ యాన్ పేరును తొలగిస్తూ.. ఆమె తమ స్టాఫ్ సభ్యురాలు కాదని పేర్కొంది. కరోనా వైరస్ ఆవిర్భావానికి చైనాయే కారణమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదేపనిగా ఆరోపిస్తున్న వేళ.. ఈ వైరాలజిస్ట్ ఇఛ్చిన ఇంటర్వ్యూ అత్యధిక ప్రాధాన్యం సంతరించుకుంది.
0 Comments:
Post a Comment