సెంట్రల్ గవర్నమెంట్ తాజాగా పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరో మూడు నెలలపాటు పీఎఫ్ కంట్రిబ్యూషన్ను ప్రభుత్వమే భరించనుంది. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో పీఎఫ్ చందాదారులకు కాస్త ఊరట కలగనుంది. పీఎఫ్ ఖాతాలో సాధారణంగా కంపెనీ 12 శాతం, ఉద్యోగి వేతనంలో 12 శాతం (బేసిక్, డీఏ) యాడ్ అవుతూ వస్తుంది. అయితే కోవిడ్-19 కారణంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ కంట్రిబ్యూషన్ను భరిస్తోంది. మార్చి, ఏప్రిల్, మే నెలలకు కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ డబ్బులను మీ తరుపున, మీ కంపెనీ తరుపున ఈపీఎఫ్ అకౌంట్లో జమచేస్తూ వచ్చింది.
తాజాగా మరో మూడు నెలలపాలు పీఎఫ్ కంట్రిబ్యూషన్ భారాన్ని మోదీ సర్కార్ భరించనుంది. దీంతో జూన్ నుంచి ఆగస్ట్ వరకు పీఎఫ్ డబ్బులు కేంద్రమే చెల్లిస్తోంది.
ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఫెసిలిటీ అందిస్తోంది. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.4860 కోట్ల భారం పడనుంది. అలాగే దాదాపు 72 లక్షల మందికి లబ్ది చేకూరనుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. అలాగే గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని కూడా నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.
తాజాగా మరో మూడు నెలలపాలు పీఎఫ్ కంట్రిబ్యూషన్ భారాన్ని మోదీ సర్కార్ భరించనుంది. దీంతో జూన్ నుంచి ఆగస్ట్ వరకు పీఎఫ్ డబ్బులు కేంద్రమే చెల్లిస్తోంది.
ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఫెసిలిటీ అందిస్తోంది. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.4860 కోట్ల భారం పడనుంది. అలాగే దాదాపు 72 లక్షల మందికి లబ్ది చేకూరనుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. అలాగే గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని కూడా నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.
0 Comments:
Post a Comment