Teachers Transfers in July
Management through web-based counseling
This time there will be no performance points
Total service and station service basis
First rationalization .. soon orders
జూలైలో టీచర్ల బదిలీలు
వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ద్వారా నిర్వహణ
ఈసారి పెర్ఫార్మెన్స్ పాయింట్లు ఉండవు
మొత్తం సర్వీసు, స్టేషన్ సర్వీసు ప్రాతిపదిక
తొలుత రేషనలైజేషన్.. త్వరలో ఉత్తర్వులు
అమరావతి, జూన్ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు పూర్వరంగం సిద్ధమవుతోంది. ఇటీవల సీఎం ఇచ్చిన గ్రీన్సిగ్నల్ మేరకు జూలైలో బదిలీలు చేపట్టే దిశగా పాఠశాల విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ఆగస్టు 3 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జూలై నెలాఖరులోగా బదిలీలు పూర్తి చేసేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఉపాధ్యాయ బదిలీలకు ముందుగా రేషనలైజేషన్ ప్రక్రియ చేపడతారు. ఈమేరకు త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. అనంతరం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ రేషనలైజేషన్, బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తారు. గతంలో మాదిరిగా ఈసారి కూడా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వెబ్ ఆధారితంగా కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీలు చేపట్టాలని భావిస్తున్నారు. గతంలో అమలు చేసిన పెర్ఫార్మెన్స్ పాయింట్ల విధానాన్ని ఈసారి రద్దు చేశారు. వివిధ కేటగిరీల టీచర్లకు ఎన్టైటిల్మెంట్ పాయింట్లు మాత్రం కొనసాగుతాయి.
ఉపాధ్యాయుల మొత్తం సర్వీసు, స్టేషన్ సర్వీసును ప్రాతిపదికగా తీసుకుని బదిలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకేచోట ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసిన టీచర్లను, అలాగే ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేస్తారు. లాంగ్ స్టాండింగ్ కటాఫ్ డేట్ను ఈ నెల 30 వరకూ తీసుకుంటారని తెలుస్తోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం టీచర్ల బదిలీల కంటే ముందుగా రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నందున తొలుత ఆ దిశగా కసరత్తు చేయనున్నారు.
Management through web-based counseling
This time there will be no performance points
Total service and station service basis
First rationalization .. soon orders
జూలైలో టీచర్ల బదిలీలు
వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ద్వారా నిర్వహణ
ఈసారి పెర్ఫార్మెన్స్ పాయింట్లు ఉండవు
మొత్తం సర్వీసు, స్టేషన్ సర్వీసు ప్రాతిపదిక
తొలుత రేషనలైజేషన్.. త్వరలో ఉత్తర్వులు
అమరావతి, జూన్ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు పూర్వరంగం సిద్ధమవుతోంది. ఇటీవల సీఎం ఇచ్చిన గ్రీన్సిగ్నల్ మేరకు జూలైలో బదిలీలు చేపట్టే దిశగా పాఠశాల విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ఆగస్టు 3 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జూలై నెలాఖరులోగా బదిలీలు పూర్తి చేసేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఉపాధ్యాయ బదిలీలకు ముందుగా రేషనలైజేషన్ ప్రక్రియ చేపడతారు. ఈమేరకు త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. అనంతరం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ రేషనలైజేషన్, బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తారు. గతంలో మాదిరిగా ఈసారి కూడా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వెబ్ ఆధారితంగా కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీలు చేపట్టాలని భావిస్తున్నారు. గతంలో అమలు చేసిన పెర్ఫార్మెన్స్ పాయింట్ల విధానాన్ని ఈసారి రద్దు చేశారు. వివిధ కేటగిరీల టీచర్లకు ఎన్టైటిల్మెంట్ పాయింట్లు మాత్రం కొనసాగుతాయి.
ఉపాధ్యాయుల మొత్తం సర్వీసు, స్టేషన్ సర్వీసును ప్రాతిపదికగా తీసుకుని బదిలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకేచోట ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసిన టీచర్లను, అలాగే ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేస్తారు. లాంగ్ స్టాండింగ్ కటాఫ్ డేట్ను ఈ నెల 30 వరకూ తీసుకుంటారని తెలుస్తోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం టీచర్ల బదిలీల కంటే ముందుగా రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నందున తొలుత ఆ దిశగా కసరత్తు చేయనున్నారు.
0 comments:
Post a comment