విజయవాడ: ఆన్లైన్ టికెట్ రిజర్వేషన్ వ్యవస్థను ఏపీఎస్ ఆర్టీసీ ఆధునీకరిస్తోంది. అన్ని బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ టికెట్ వ్యవస్ధ అమలు చేయాలని నిర్ణయించింది. నగదు రహిత, కాంటాక్ట్ లెస్ టికెటింగ్ తీసుకునేలా వ్యవస్థను రూపొందిస్తోంది. పలు వినూత్న సేవలతో అధునాతన రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఒకేసారి 50 వేల మంది ప్రయాణికులు సేవలు పొందేలా వెబ్సైట్ను ఆధునీకరిస్తోంది. ఆధునీకరణ కారణంగా ఈనెల 30న సర్వర్ను అధికారులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. దీంతో ఈ నెల 30న రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆర్టీసీ వెబ్సైట్ నిలిచిపోనుంది.
ఆ సమయంలో ఎలాంటి టికెట్ బుకింగ్లు, రద్దు సౌకర్యం ఉండదని అధికారులు తెలిపారు.
ఆ సమయంలో ఎలాంటి టికెట్ బుకింగ్లు, రద్దు సౌకర్యం ఉండదని అధికారులు తెలిపారు.
0 comments:
Post a comment