యూజీసీకి నిపుణుల కమిటీ సూచనలు
వర్సిటీలకు వారానికి ఆరు రోజుల పనిదినాలు
సంవత్సరాంత పరీక్షలు జూలై 1 నుంచి 15 వరకు నిర్వహించాలి
పీజీ, యూజీ కోర్సుల్లోకి ప్రవేశాలను ఆగస్టు 31లోపు జరుపుకోవచ్చు
సాక్షి, అమరావతి: లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రస్తుత 2019–20లో విద్యా సంస్థలన్నీ స్తంభించిపోయాయి. పరీక్షలు, ఇతరత్రా కార్యక్రమాలు నిలిచిపోయాయి. వాటిని నిర్వహించడంతోపాటు వచ్చే 2020–21 విద్యా సంవత్సరం పైనా దాని ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుత విద్యా సంవత్సరపు పరీక్షల నిర్వహణను ముగించడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు, తరగతుల నిర్వహణ, పరీక్షలపై నిపుణుల కమిటీ యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్ (యూజీసీ)కు పలు సిపార్సులు చేసింది. వచ్చే విద్యా సంవత్సరాన్ని 2020 ఆగస్టు 1 నుంచి ప్రారంభించాలని సూచించింది. అలాగే, సెమిస్టర్ల వారీగా పరీక్షల తేదీలను కూడా కమిటీ వివరించింది. అంతేకాదు.. వర్సిటీలు వారానికి 6 రోజులు పనిదినాలుగా పెట్టుకోవాలని తెలిపింది. ఇప్పటికే ఆగిపోయిన ప్రాజెక్టు వర్కు డిజర్టేషన్, ఇంటర్న్షిప్, ఈ ల్యాబ్స్, సిలబస్ పూర్తి, ఇంటర్నల్ అసెస్మెంటు, అసైన్మెంట్లు, ప్లేస్మెంటు డ్రైవ్ కార్యక్రమాలను మే 16 నుంచి మే 31లోపు పూర్తిచేయాలి.
పరీక్షల షెడ్యూల్ ఇలా ఉండాలి..
► సంవత్సరాంత పరీక్షలు జూలై 1–15 వరకు నిర్వహించాలి.
► పరీక్షల నిర్వహణలో వర్సిటీలు, కాలేజీలు ప్రత్యామ్నాయ, సులభ మార్గాలను ఎంచుకోవాలి.
► యూజీసీ నిర్దేశించిన సీబీసీఎస్ విధానంలో తక్కువ సమయంలో పూర్తిచేసేలా చూడాలి.
► ఓఎమ్మార్/ఎంసీక్యూ ఆధారిత పరీక్షలు, ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్, ఓపెన్ చాయిస్ అసైన్మెంటు వంటివి అనుసరించాలి.
► భౌతిక దూరాన్ని పాటిస్తూ బహుళ షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించాలి. పరీక్షల సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు కుదించాలి.
► మిడ్ సెమిస్టర్ తదితర ఇంటర్నల్ ఇవాల్యుయేషన్ మార్కులకు 50 శాతం, తక్కిన 50 శాతం మార్కులను అంతకుముందు విద్యార్థి పనితీరుకు వచ్చిన మార్కుల ఆధారంగా తీసుకోవాలి.
► యూజీ, పీజీ కోర్సుల సెమిస్టర్/ఇయర్లీ పరీక్షలను ఆయా వర్సిటీలు లాక్డౌన్ తొలగింపు పరిస్థితులను అనుసరించి నిర్వహించుకోవాలి.
► ల్యాబ్ ప్రాజెక్టులకు బదులు సాఫ్ట్వేర్ ఆధారిత ప్రాజెక్టులను ఇవ్వాలి. స్కైప్ తదితర విధానాల్లో వైవా నిర్వహించాలి.
► రాష్ట్ర, జాతీయస్థాయి కామన్ ఎంట్రన్స్ పరీక్షలను ఆయా వర్సిటీలు పరిస్థితులను అనుసరించి నిర్వహించుకోవచ్చు.
► వర్సిటీలు పీజీ, యూజీ కోర్సుల్లోకి 2020–21 ప్రవేశాలను ఆగస్టు 31లోపు నిర్వహించుకోవచ్చు. సెప్టెంబర్ 30 నాటికి ధ్రువపత్రాల పరిశీలన జరగాలి.
వర్సిటీలకు వారానికి ఆరు రోజుల పనిదినాలు
సంవత్సరాంత పరీక్షలు జూలై 1 నుంచి 15 వరకు నిర్వహించాలి
పీజీ, యూజీ కోర్సుల్లోకి ప్రవేశాలను ఆగస్టు 31లోపు జరుపుకోవచ్చు
సాక్షి, అమరావతి: లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రస్తుత 2019–20లో విద్యా సంస్థలన్నీ స్తంభించిపోయాయి. పరీక్షలు, ఇతరత్రా కార్యక్రమాలు నిలిచిపోయాయి. వాటిని నిర్వహించడంతోపాటు వచ్చే 2020–21 విద్యా సంవత్సరం పైనా దాని ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుత విద్యా సంవత్సరపు పరీక్షల నిర్వహణను ముగించడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు, తరగతుల నిర్వహణ, పరీక్షలపై నిపుణుల కమిటీ యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్ (యూజీసీ)కు పలు సిపార్సులు చేసింది. వచ్చే విద్యా సంవత్సరాన్ని 2020 ఆగస్టు 1 నుంచి ప్రారంభించాలని సూచించింది. అలాగే, సెమిస్టర్ల వారీగా పరీక్షల తేదీలను కూడా కమిటీ వివరించింది. అంతేకాదు.. వర్సిటీలు వారానికి 6 రోజులు పనిదినాలుగా పెట్టుకోవాలని తెలిపింది. ఇప్పటికే ఆగిపోయిన ప్రాజెక్టు వర్కు డిజర్టేషన్, ఇంటర్న్షిప్, ఈ ల్యాబ్స్, సిలబస్ పూర్తి, ఇంటర్నల్ అసెస్మెంటు, అసైన్మెంట్లు, ప్లేస్మెంటు డ్రైవ్ కార్యక్రమాలను మే 16 నుంచి మే 31లోపు పూర్తిచేయాలి.
పరీక్షల షెడ్యూల్ ఇలా ఉండాలి..
► సంవత్సరాంత పరీక్షలు జూలై 1–15 వరకు నిర్వహించాలి.
► పరీక్షల నిర్వహణలో వర్సిటీలు, కాలేజీలు ప్రత్యామ్నాయ, సులభ మార్గాలను ఎంచుకోవాలి.
► యూజీసీ నిర్దేశించిన సీబీసీఎస్ విధానంలో తక్కువ సమయంలో పూర్తిచేసేలా చూడాలి.
► ఓఎమ్మార్/ఎంసీక్యూ ఆధారిత పరీక్షలు, ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్, ఓపెన్ చాయిస్ అసైన్మెంటు వంటివి అనుసరించాలి.
► భౌతిక దూరాన్ని పాటిస్తూ బహుళ షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించాలి. పరీక్షల సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు కుదించాలి.
► మిడ్ సెమిస్టర్ తదితర ఇంటర్నల్ ఇవాల్యుయేషన్ మార్కులకు 50 శాతం, తక్కిన 50 శాతం మార్కులను అంతకుముందు విద్యార్థి పనితీరుకు వచ్చిన మార్కుల ఆధారంగా తీసుకోవాలి.
► యూజీ, పీజీ కోర్సుల సెమిస్టర్/ఇయర్లీ పరీక్షలను ఆయా వర్సిటీలు లాక్డౌన్ తొలగింపు పరిస్థితులను అనుసరించి నిర్వహించుకోవాలి.
► ల్యాబ్ ప్రాజెక్టులకు బదులు సాఫ్ట్వేర్ ఆధారిత ప్రాజెక్టులను ఇవ్వాలి. స్కైప్ తదితర విధానాల్లో వైవా నిర్వహించాలి.
► రాష్ట్ర, జాతీయస్థాయి కామన్ ఎంట్రన్స్ పరీక్షలను ఆయా వర్సిటీలు పరిస్థితులను అనుసరించి నిర్వహించుకోవచ్చు.
► వర్సిటీలు పీజీ, యూజీ కోర్సుల్లోకి 2020–21 ప్రవేశాలను ఆగస్టు 31లోపు నిర్వహించుకోవచ్చు. సెప్టెంబర్ 30 నాటికి ధ్రువపత్రాల పరిశీలన జరగాలి.
0 Comments:
Post a Comment