కరోనా నివారణ సూత్రాల్లో భాగంగా . . . మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్లు రోజంతా వేడినీళ్లు తాగుతూ ఉండమని సూచిస్తున్నారు .
వేడినీళ్ల వల్ల శ్వాసకోశ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు .
జీర్ణ క్రియను మెరుగుపరచడం దగ్గరి నుంచి రక్త ప్రసరణ దాకా గోరువెచ్చని నీరు చేయని మేలు లేదంటున్నారు .
తగినన్ని నీళ్లు తాగకపోతే , జీర్ణవ్యవస్థ మనం తీసుకునే ఆహారం నుంచే నీటిని గ్రహిస్తుంది .
దాంతో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది . తద్వారా జీర్ణ క్రియ మందగిస్తుంది .
విసర్జనలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి .
ఇదంతా దీర్ఘకాలిక మలబద్దకానికి కారణం అవుతుంది . వేడినీళ్లు తాగడం వల్ల ఆహారం వేగంగా జీర్ణం అవుతుంది . పేగుల కదలిక మెరుగుపడి మలబద్దకం దూరం అవుతుంది .
డీటాక్సిఫికేషన్ : వేడినీళ్లు శరీరంలోని మలినాలను వదలగొడతాయని చెబుతున్నారు నిపు ణులు . వేడినీళ్లు తాగినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరిగి , చెమట పడ్తుంది . తద్వారా వ్యర్థాలు బయ టికి వెళ్లిపోతాయి .
రక్తప్రసరణ : వేడినీళ్లు రక్తనాళాలను వెడల్పు చేస్తాయి . వాటిలో ప్రయాణించే రక్తం మెరుగ్గా ప్రస రణ చెందుతుంది . రక్తప్రసరణ బాగుండటం వల్ల కండరాలు రిలాక్స్ అయ్యి , నొప్పులు తగ్గు తాయి.
బరువు తగ్గడం : నీళ్లు తాగడం వల్ల పోషకాల పోషణ , వ్యర్థాల విసర్జన మెరుగ్గా జరుగుతాయి . వేడినీళ్లు తాగితే కచ్చితంగా బరువు తగ్గుతారని ఓ అధ్యయనంలో తేలింది . భోజనానికి ముందు అరలీటరు వేడినీటిని తీసుకోవడం వల్ల మెటబాలిజం 30 శాతం పెరిగిందని కూడా పరిశోధకులు చెప్తున్నారు .
శ్వాస : జలుబు , దగ్గు ఉన్నప్పుడు వేడినీటి ఆవిరి పడితే ఎంతో ఉపశమనం కలుగుతుంది . అదే విధంగా వేడినీటిని తాగడం వల్ల లోపలున్న శ్లేష్మం వేగంగా కదులుతుంది . దాంతో కఫం అంతా బయటికి వెళ్లిపోతుంది . కాబట్టి , శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు , శ్వాసలో ఇబ్బందులు ఉన్నప్పుడు వేడినీ టిని పుచ్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఒత్తిడి : మానసిక ఒత్తిడి , ఆందోళన ఉన్నప్పుడు టీ , కాఫీలు తాగుతుంటాం . వీటివల్ల ఒత్తిడి ఎంతో కొంత తగ్గినట్టు అనిపిస్తుంది . అయితే వేడినీళ్లు తాగితే కూడా ఒత్తిడి నుంచి ఇలాంటి సాంత్వనే కలుగుతుంది . నాడీవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో వేడినీళ్లు లేదా వేడి కాఫీ - టీ - పాలు సహాయపడుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి .
వేడినీళ్ల వల్ల శ్వాసకోశ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు .
జీర్ణ క్రియను మెరుగుపరచడం దగ్గరి నుంచి రక్త ప్రసరణ దాకా గోరువెచ్చని నీరు చేయని మేలు లేదంటున్నారు .
తగినన్ని నీళ్లు తాగకపోతే , జీర్ణవ్యవస్థ మనం తీసుకునే ఆహారం నుంచే నీటిని గ్రహిస్తుంది .
దాంతో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది . తద్వారా జీర్ణ క్రియ మందగిస్తుంది .
విసర్జనలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి .
ఇదంతా దీర్ఘకాలిక మలబద్దకానికి కారణం అవుతుంది . వేడినీళ్లు తాగడం వల్ల ఆహారం వేగంగా జీర్ణం అవుతుంది . పేగుల కదలిక మెరుగుపడి మలబద్దకం దూరం అవుతుంది .
డీటాక్సిఫికేషన్ : వేడినీళ్లు శరీరంలోని మలినాలను వదలగొడతాయని చెబుతున్నారు నిపు ణులు . వేడినీళ్లు తాగినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరిగి , చెమట పడ్తుంది . తద్వారా వ్యర్థాలు బయ టికి వెళ్లిపోతాయి .
రక్తప్రసరణ : వేడినీళ్లు రక్తనాళాలను వెడల్పు చేస్తాయి . వాటిలో ప్రయాణించే రక్తం మెరుగ్గా ప్రస రణ చెందుతుంది . రక్తప్రసరణ బాగుండటం వల్ల కండరాలు రిలాక్స్ అయ్యి , నొప్పులు తగ్గు తాయి.
బరువు తగ్గడం : నీళ్లు తాగడం వల్ల పోషకాల పోషణ , వ్యర్థాల విసర్జన మెరుగ్గా జరుగుతాయి . వేడినీళ్లు తాగితే కచ్చితంగా బరువు తగ్గుతారని ఓ అధ్యయనంలో తేలింది . భోజనానికి ముందు అరలీటరు వేడినీటిని తీసుకోవడం వల్ల మెటబాలిజం 30 శాతం పెరిగిందని కూడా పరిశోధకులు చెప్తున్నారు .
శ్వాస : జలుబు , దగ్గు ఉన్నప్పుడు వేడినీటి ఆవిరి పడితే ఎంతో ఉపశమనం కలుగుతుంది . అదే విధంగా వేడినీటిని తాగడం వల్ల లోపలున్న శ్లేష్మం వేగంగా కదులుతుంది . దాంతో కఫం అంతా బయటికి వెళ్లిపోతుంది . కాబట్టి , శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు , శ్వాసలో ఇబ్బందులు ఉన్నప్పుడు వేడినీ టిని పుచ్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఒత్తిడి : మానసిక ఒత్తిడి , ఆందోళన ఉన్నప్పుడు టీ , కాఫీలు తాగుతుంటాం . వీటివల్ల ఒత్తిడి ఎంతో కొంత తగ్గినట్టు అనిపిస్తుంది . అయితే వేడినీళ్లు తాగితే కూడా ఒత్తిడి నుంచి ఇలాంటి సాంత్వనే కలుగుతుంది . నాడీవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో వేడినీళ్లు లేదా వేడి కాఫీ - టీ - పాలు సహాయపడుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి .
0 Comments:
Post a Comment