మాధ్యమం ఎంపిక అవకాశం తల్లిదండ్రులకే
1 నుంచి 5 తరగతులపై ఉత్తర్వులు
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతుల వరకు తమ పిల్లలు ఏ మాధ్యమంలో చదవాలో ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థుల తల్లిదండ్రులకే ప్రభుత్వం కల్పించింది. ఈమేరకు మంగళవారం రాత్రి 11.30 గంటలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆంగ్ల మాధ్యమంపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి మాధ్యమం ఎంపిక ఫారాలు గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మండల, జిల్లా విద్యాశాఖాధికారులు.. ఆయా ఫారాల్లో తల్లిదండ్రులు ఎంపిక చేసిన మాధ్యమాల వివరాలను మదించి, ప్రభుత్వానికి నివేదిస్తారు.
తల్లిదండ్రుల అభిప్రాయాల సేకరణకు ప్రభుత్వ నిర్ణయం
జిల్లా, మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఏ మీడియంలో చదవాలని భావిస్తున్నారో తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థుల తల్లిదండ్రులు/ సంరక్షకుల అభిప్రాయాలను తెలుసుకుని నివేదించాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ను ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి బి.రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
► ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకునేలా 2020–21 విద్యా సంవత్సరం ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అనంతరం ప్రతి ఏటా ఒక్కో తరగతి పెంచుకుంటూ నాలుగేళ్లలో పదవ తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలను ఇంగ్లిష్ మీడియంలో రాసేలా తీర్చిదిద్దాలని భావించింది.
► ఇదే సమయంలో అన్ని పాఠశాలల్లోనూ తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా కూడా చేసింది. ఈ మేరకు ప్రతి మండల కేంద్రంలోనూ ఓ తెలుగు మీడియం పాఠశాల కొనసాగించాలని నిర్ణయించింది.
► కాగా ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ కొందరు కోర్టులో కేసు వేశారు. తమ పిల్లలు ఏ మీడియంలో చదవాలో నిర్ణయించుకునే హక్కు తల్లిదండ్రులకే ఉందని కోర్టు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకోవాలని నిర్ణయించింది.
1 నుంచి 5 తరగతులపై ఉత్తర్వులు
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతుల వరకు తమ పిల్లలు ఏ మాధ్యమంలో చదవాలో ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థుల తల్లిదండ్రులకే ప్రభుత్వం కల్పించింది. ఈమేరకు మంగళవారం రాత్రి 11.30 గంటలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆంగ్ల మాధ్యమంపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి మాధ్యమం ఎంపిక ఫారాలు గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మండల, జిల్లా విద్యాశాఖాధికారులు.. ఆయా ఫారాల్లో తల్లిదండ్రులు ఎంపిక చేసిన మాధ్యమాల వివరాలను మదించి, ప్రభుత్వానికి నివేదిస్తారు.
తల్లిదండ్రుల అభిప్రాయాల సేకరణకు ప్రభుత్వ నిర్ణయం
జిల్లా, మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఏ మీడియంలో చదవాలని భావిస్తున్నారో తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థుల తల్లిదండ్రులు/ సంరక్షకుల అభిప్రాయాలను తెలుసుకుని నివేదించాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ను ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి బి.రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
► ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకునేలా 2020–21 విద్యా సంవత్సరం ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అనంతరం ప్రతి ఏటా ఒక్కో తరగతి పెంచుకుంటూ నాలుగేళ్లలో పదవ తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలను ఇంగ్లిష్ మీడియంలో రాసేలా తీర్చిదిద్దాలని భావించింది.
► ఇదే సమయంలో అన్ని పాఠశాలల్లోనూ తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా కూడా చేసింది. ఈ మేరకు ప్రతి మండల కేంద్రంలోనూ ఓ తెలుగు మీడియం పాఠశాల కొనసాగించాలని నిర్ణయించింది.
► కాగా ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ కొందరు కోర్టులో కేసు వేశారు. తమ పిల్లలు ఏ మీడియంలో చదవాలో నిర్ణయించుకునే హక్కు తల్లిదండ్రులకే ఉందని కోర్టు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకోవాలని నిర్ణయించింది.
0 Comments:
Post a Comment