దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నందున మనమంతా 21 రోజుల పాటు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో 'ఈ 21 రోజుల్లో 21 పాఠాలు' నేర్చుకుందాం అంటూ కర్ణాటకకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై జీవిత పాఠాలను చెబుతున్నారు. ఈ సందర్భంగా యాంత్రిక జీవనంతో ఏర్పడే సమస్యలను వివరించారు. అదే సమయంలో మేధాశక్తిని ఎలా పెంపొందించుకోవాలో వివరించారు. ఆ వివరణ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..
మేధస్సుకు సరైన అర్థం జ్ఞానం, నైపుణ్యాల కలయిక. ఈ రెండూ కలిస్తేనే మేధా శక్తి. అదే మానవాళిని అతి శక్తిమంతమైన జీవిగా తీర్చిదిద్దింది. మనకు సహజ సిద్ధంగా ఏర్పడిన మేధస్సు పూర్వికుల నుంచి సంక్రమించిందే. ఒకానొకప్పుడు వేటగాడిగా ఉన్న మనుషులు అద్భుతాలు చేస్తూ చంద్రుడిపై కాలు పెట్టే స్థాయికి ఎదిగారు.
అంగారకుడిపై ఇల్లు కట్టుకొనేలా ఆవిష్కరణలు చేశారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) గురించి తెలుసుకుంటున్నాం. భవిష్యత్తు అంతా మెషీన్స్, న్యూరల్ అండ్ డీప్ లర్నింగ్దే. మన కంప్యూటింగ్ పవర్తో జీవన విధానం పూర్తిగా మారిపోతోంది. మన జన్యువులను డీకోడ్ చేయగలగుతున్నాం. కొత్త ఔషధాలను కనుక్కుంటున్నాం. కఠిన సమస్యలను పరిష్కరించగలుగుతున్నాం. త్వరలోనే డ్రైవర్ లెస్ కారును ఆహ్వానించబోతున్నాం. ఇప్పటికే లైట్ ఆర్పాలన్నా, ఆన్ చేయాలన్నా ఫిజికల్ యాక్టివిటీ లేకుండానే చేసేస్తున్నాం. ఇంట్లోని వస్తువులను వాయిస్ కమాండ్స్తో నియత్రించే స్థాయికి వచ్చేశాం. ఇది మన లైఫ్ను కంఫర్ట్ జోన్లోకి పంపిస్తోంది. బాగా సుఖంగా ఉంటోంది కూడా.మరోవైపున చూస్తే.. పది అంకెల ఫోన్ నంబర్ను కూడా గుర్తు పెట్టుకోలేకపోతున్నాం. పేర్లు కూడా.. మన దగ్గరి వాళ్లలో ఐదుగురి ఫోన్ నంబర్లు టక్కున చెప్పేయగలమా? అంటే.. నో అనాల్సిందే. కానీ ఒకప్పుడు వందల నంబర్లు గుర్తు పెట్టుకునేవాళ్లం. ఎవరైనా అడ్రస్ అడిగితే పక్కన షాప్ పేరు, బిల్డింగ్ కలర్తో సహా చెప్పేవాళ్లం. మరి ఇప్పుడు? మ్యాప్స్ ఆన్ చేసుకొని లొకేషన్కు చేరిపోతున్నాం. దాంతో ఎటు వెళ్తున్నామో తెలీకుండానే గమ్యం చేరేస్తున్నాం. మన జీవితాలను కూడా షెడ్యూల్ చేసుకోవాల్సిన పరిస్థితి. అదందా టెక్నాలజీ వల్లే. అంటే. మన మేథా శక్తిని కోల్పోతున్నామన్న మాట. ఒక్క మాటలో చెప్పాలంటే వెబ్ అనే ట్రాప్లో పడుతున్నాం. ప్రస్తుత యువత అయితే మరీ ఎక్కువ.
మన జీవితాలను మరింత సుఖవంతంగా, సౌకర్యవంతంగా మార్చుకోవడంలో తప్పు లేదు. కానీ.. టెక్నాలజీకి బానిస కాకుండా ఉండాలి. ఏ సమయంలో టెక్నాలజీని ఆహ్వానించాలి? ఏ టైంలో తిరస్కరించాలి అని నిర్ణయించుకోవడానికి ఇదే సరైన సమయం. లేకపోతే మన జీవితాలపై మనమే నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఓ సర్వే ఏం చెప్పిందంటే... టెక్నాలజీకి బానిస అయితే రాబోయే రోజుల్లో ఆలోచనాశక్తిని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని. పలు కంపెనీలు మనం ఎక్కడుంటున్నామో తెలుసుకుంటున్నాయి. ఏం కోరుకుంటున్నామో చెబుతున్నాయి. మనం పనిచేసే చోటు, సమయం, తినే అలవాట్లు.. ఇలా అన్నీ వాళ్ల నియంత్రణలోకి వెళ్లిపోతున్నాయి. దానికి కారణం టెక్నాలజీనే. రాను రాను మనిషి రోబోలా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదనే.
మరి మన సహజసిద్ధమైన మేధాశక్తిని ఎలా పెంచుకోవాలి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఎక్కడుంచాలి? అంటే.. లాక్డౌన్ సమయాన్ని వాడుకొని ఘనమైన మేధస్సును సొంతం చేసుకోవచ్చు. అంటే.. మన కామన్ సెన్స్ను మనం తెచ్చుకున్నట్లే లెక్క. అందుకే.. మన చుట్టూ ఉన్న వ్యక్తులపై, వస్తువులపై, ప్రాంతాలపై ఓ కన్నేస్తూ ఉండాలి. కాంటాక్ట్ బుక్లో వెతక్కుండా తెలిసిన 20 మంది ఫోన్ నంబర్లను గుర్తుంచుకొనేలా చేసుకోవాలి. మనం ఉండే నగరం లేదా పట్టణంలోని మూలలన్నీ తెలుసుకోవాలి. లాక్డౌన్లో సాధ్యం కాకపోయినా ఆ తర్వాతైనా తిరిగేయాలి. కొన్ని ప్రముఖ స్థలాలను గుర్తు పెట్టుకోవాలి. ప్రియమైన వాళ్ల పుట్టిన రోజులు, పెళ్లి రోజులను గుర్తుంచుకోవాలి. ఒకే సారి ఇదంతా సాధ్యం కాకపోవచ్చు. మెల్లిమెల్లిగా అయినా సరే.. మనకు మన పూర్వికులు అందించిన సహజసిద్ధమైన మేధాశక్తిని తిరిగి దక్కించుకోవాలి. మెదడులోని న్యూరాన్లను యాక్టివేట్ చేయాలి. మెదడుకు మేత పెడితేనే అది సాధ్యం అవుతుంది. అందుకే.. గెట్ రెడీ నౌ..!
మేధస్సుకు సరైన అర్థం జ్ఞానం, నైపుణ్యాల కలయిక. ఈ రెండూ కలిస్తేనే మేధా శక్తి. అదే మానవాళిని అతి శక్తిమంతమైన జీవిగా తీర్చిదిద్దింది. మనకు సహజ సిద్ధంగా ఏర్పడిన మేధస్సు పూర్వికుల నుంచి సంక్రమించిందే. ఒకానొకప్పుడు వేటగాడిగా ఉన్న మనుషులు అద్భుతాలు చేస్తూ చంద్రుడిపై కాలు పెట్టే స్థాయికి ఎదిగారు.
అంగారకుడిపై ఇల్లు కట్టుకొనేలా ఆవిష్కరణలు చేశారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) గురించి తెలుసుకుంటున్నాం. భవిష్యత్తు అంతా మెషీన్స్, న్యూరల్ అండ్ డీప్ లర్నింగ్దే. మన కంప్యూటింగ్ పవర్తో జీవన విధానం పూర్తిగా మారిపోతోంది. మన జన్యువులను డీకోడ్ చేయగలగుతున్నాం. కొత్త ఔషధాలను కనుక్కుంటున్నాం. కఠిన సమస్యలను పరిష్కరించగలుగుతున్నాం. త్వరలోనే డ్రైవర్ లెస్ కారును ఆహ్వానించబోతున్నాం. ఇప్పటికే లైట్ ఆర్పాలన్నా, ఆన్ చేయాలన్నా ఫిజికల్ యాక్టివిటీ లేకుండానే చేసేస్తున్నాం. ఇంట్లోని వస్తువులను వాయిస్ కమాండ్స్తో నియత్రించే స్థాయికి వచ్చేశాం. ఇది మన లైఫ్ను కంఫర్ట్ జోన్లోకి పంపిస్తోంది. బాగా సుఖంగా ఉంటోంది కూడా.మరోవైపున చూస్తే.. పది అంకెల ఫోన్ నంబర్ను కూడా గుర్తు పెట్టుకోలేకపోతున్నాం. పేర్లు కూడా.. మన దగ్గరి వాళ్లలో ఐదుగురి ఫోన్ నంబర్లు టక్కున చెప్పేయగలమా? అంటే.. నో అనాల్సిందే. కానీ ఒకప్పుడు వందల నంబర్లు గుర్తు పెట్టుకునేవాళ్లం. ఎవరైనా అడ్రస్ అడిగితే పక్కన షాప్ పేరు, బిల్డింగ్ కలర్తో సహా చెప్పేవాళ్లం. మరి ఇప్పుడు? మ్యాప్స్ ఆన్ చేసుకొని లొకేషన్కు చేరిపోతున్నాం. దాంతో ఎటు వెళ్తున్నామో తెలీకుండానే గమ్యం చేరేస్తున్నాం. మన జీవితాలను కూడా షెడ్యూల్ చేసుకోవాల్సిన పరిస్థితి. అదందా టెక్నాలజీ వల్లే. అంటే. మన మేథా శక్తిని కోల్పోతున్నామన్న మాట. ఒక్క మాటలో చెప్పాలంటే వెబ్ అనే ట్రాప్లో పడుతున్నాం. ప్రస్తుత యువత అయితే మరీ ఎక్కువ.
మన జీవితాలను మరింత సుఖవంతంగా, సౌకర్యవంతంగా మార్చుకోవడంలో తప్పు లేదు. కానీ.. టెక్నాలజీకి బానిస కాకుండా ఉండాలి. ఏ సమయంలో టెక్నాలజీని ఆహ్వానించాలి? ఏ టైంలో తిరస్కరించాలి అని నిర్ణయించుకోవడానికి ఇదే సరైన సమయం. లేకపోతే మన జీవితాలపై మనమే నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఓ సర్వే ఏం చెప్పిందంటే... టెక్నాలజీకి బానిస అయితే రాబోయే రోజుల్లో ఆలోచనాశక్తిని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని. పలు కంపెనీలు మనం ఎక్కడుంటున్నామో తెలుసుకుంటున్నాయి. ఏం కోరుకుంటున్నామో చెబుతున్నాయి. మనం పనిచేసే చోటు, సమయం, తినే అలవాట్లు.. ఇలా అన్నీ వాళ్ల నియంత్రణలోకి వెళ్లిపోతున్నాయి. దానికి కారణం టెక్నాలజీనే. రాను రాను మనిషి రోబోలా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదనే.
మరి మన సహజసిద్ధమైన మేధాశక్తిని ఎలా పెంచుకోవాలి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఎక్కడుంచాలి? అంటే.. లాక్డౌన్ సమయాన్ని వాడుకొని ఘనమైన మేధస్సును సొంతం చేసుకోవచ్చు. అంటే.. మన కామన్ సెన్స్ను మనం తెచ్చుకున్నట్లే లెక్క. అందుకే.. మన చుట్టూ ఉన్న వ్యక్తులపై, వస్తువులపై, ప్రాంతాలపై ఓ కన్నేస్తూ ఉండాలి. కాంటాక్ట్ బుక్లో వెతక్కుండా తెలిసిన 20 మంది ఫోన్ నంబర్లను గుర్తుంచుకొనేలా చేసుకోవాలి. మనం ఉండే నగరం లేదా పట్టణంలోని మూలలన్నీ తెలుసుకోవాలి. లాక్డౌన్లో సాధ్యం కాకపోయినా ఆ తర్వాతైనా తిరిగేయాలి. కొన్ని ప్రముఖ స్థలాలను గుర్తు పెట్టుకోవాలి. ప్రియమైన వాళ్ల పుట్టిన రోజులు, పెళ్లి రోజులను గుర్తుంచుకోవాలి. ఒకే సారి ఇదంతా సాధ్యం కాకపోవచ్చు. మెల్లిమెల్లిగా అయినా సరే.. మనకు మన పూర్వికులు అందించిన సహజసిద్ధమైన మేధాశక్తిని తిరిగి దక్కించుకోవాలి. మెదడులోని న్యూరాన్లను యాక్టివేట్ చేయాలి. మెదడుకు మేత పెడితేనే అది సాధ్యం అవుతుంది. అందుకే.. గెట్ రెడీ నౌ..!
0 Comments:
Post a Comment