అమరావతి, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర చరిత్ర లో ఎప్పుడూ జరగని విధంగా మార్చి 31వరకూ ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఒక్క రూపాయి కూడా పెండింగ్ పెట్టకుండా ఇస్తున్నామని సీఎం జగ న్ అన్నారు. 2018-19లో గత ప్రభుత్వం పెట్టిన రూ. 1,880 కోట్ల బకాయిలతో పాటు 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇవ్వాల్సిన డబ్బులన్నీ చెల్లిస్తున్నామని చెప్పారు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ప్రతి త్రైమాసికం పూర్తయిన తర్వాత నేరుగా తల్లుల ఖాతాలోనే రీయింబర్స్మెంట్ డబ్బులు వేస్తామన్నారు. జగనన్న విద్యా దీవెన పథకాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం మంగళవారం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాలేజీల మేనేజ్మెంట్లు, తల్లులు, విద్యార్థులతో మాట్లాడారు. బోర్డింగ్, లాడ్జింగ్ కోసం వసతి దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కో సం విద్యాదీవెన అనే రెండు పథకాలను తీసుకువచ్చామన్నారు. పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి ఒక్క చదువు మాత్రమేనన్నారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘నా న్నగారి హయాంలో మొదటిసారిగా ఎవరూ చేయని ఆలోచన చేసి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకువచ్చారు.
అప్పట్లో ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లోని పేదలందరికీ పూర్తి భరోసా ఉండేది. ఆయన చనిపోయాక పథకాన్ని పూర్తిగా నీరుగారుస్తూ పోయారు. నెల్లూరులో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో గోపాల్ అనే ఒక తండ్రి ఇంటి ముందు తన కొడుకు ఫొటో, నివాళులర్పిస్తున్న ఫ్లెక్సీ పెట్టి ఉంది. ఏమైందని అడిగితే... ‘ఇంటర్లో మంచి మార్కులొస్తే ఇంజనీరింగ్ చదువుతానంటే కాలేజీలో చేర్పించా. కానీ చాలీచాలని ఫీజులు ఇచ్చేవారు, బోర్డింగ్ మెస్ చార్జీలు కలిపితే రూ.లక్ష దాటే పరిస్థితి. బ్యాలెన్స్ ఫీజు ఏం చేస్తావు నాన్నా... అని నా కొడుకు అడిగాడు. సెలవులకు ఇంటికి రాగానే మళ్లీ అ దే ప్రశ్న వేశాడు. ఏదో ఒకటి చేసి చదివిస్తా అన్నాను. తన చదువు కోసం తండ్రి, కుటుంబం కొవ్వొత్తిలా కరిగిపోవడం ఇష్టంలేక పిల్లవాడు ఆత్మహత్య చేసుకున్నాడ’ని చెప్పాడు. ఆ రోజు నేను అనుకున్న కార్యక్రమాన్ని దేవుడి దయతో, అందరి ఆశీర్వాదంతో అమలు చేస్తు న్నాం’’ అని సీఎం జగన్ అన్నారు.
కొత్త ఒరవడికి నాంది
‘‘తల్లులు ఫీజులు కట్టడం వల్ల కాలేజీలను వారు అడగ్గలరు. టీచింగ్ స్టాఫ్ బాగా లేకపోయినా, వసతు లు లేకున్నా ప్రశ్నించే అవకాశం వస్తుంది. 3నెలలకోసారి డబ్బు కట్టడానికి వెళ్లడంవల్ల పిల్లలెలా చదువుతున్నారో తెలుసుకునే అవకాశముంటుంది. ఇది కొత్త ఒరవడికి నాంది పలుకుతుందని సగర్వంగా తెలియజేస్తున్నాం. అలాగే విద్యాదీవెన పథకాన్ని కూడా ప్రారంభించాం. పిల్లలకు బోర్డింగ్, లాడ్జింగ్ కోసం ఏడాదికి రూ.20 వేల వరకూ ఇస్తున్నాం.
కాలేజీలు ఆ డబ్బు వెనక్కివ్వాలి
‘‘కరోనా లాంటి కష్టాలున్నా మా ఇబ్బందుల కన్నా మీ ఇబ్బందులు పెద్దవని భావిస్తున్నాం. గడచిన సంవత్సరాల్లో అడ్మిషన్లు తీసుకున్నవారే కాకుండా పై తరగతులు చదువుతున్న వారికీ సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేస్తున్నాం. స్పెషల్ ఫీజులు, ఇతరత్రా ఫీజులూ ఉండవు. ఇప్పటికే ఎవరైనా ఫీజు కట్టి ఉం టే.. ఇప్పుడు కాలేజీ యాజమాన్యాలకు పూర్తి ఫీజులు చెల్లిస్తున్నాం కాబట్టి ఆ డబ్బును తల్లిదండ్రులకు వెన క్కు ఇవ్వాలి. తల్లిదండ్రులకు లేఖలు రాశాం. వలంటీర్ల ద్వారా అవి చేరతాయి. కాలేజీల్లో సదుపాయాలు, మౌలిక వసతులు సరిగ్గా లేవని భావిస్తే తల్లులు 1902 నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యను చెప్పవచ్చు. ఉన్నత విద్యాశాఖలో కాల్సెంటర్ ఉంటుంది. ఏ సమస్యలున్నా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది’’ అని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, అధికారులు పాల్గొన్నారు.
అప్పట్లో ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లోని పేదలందరికీ పూర్తి భరోసా ఉండేది. ఆయన చనిపోయాక పథకాన్ని పూర్తిగా నీరుగారుస్తూ పోయారు. నెల్లూరులో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో గోపాల్ అనే ఒక తండ్రి ఇంటి ముందు తన కొడుకు ఫొటో, నివాళులర్పిస్తున్న ఫ్లెక్సీ పెట్టి ఉంది. ఏమైందని అడిగితే... ‘ఇంటర్లో మంచి మార్కులొస్తే ఇంజనీరింగ్ చదువుతానంటే కాలేజీలో చేర్పించా. కానీ చాలీచాలని ఫీజులు ఇచ్చేవారు, బోర్డింగ్ మెస్ చార్జీలు కలిపితే రూ.లక్ష దాటే పరిస్థితి. బ్యాలెన్స్ ఫీజు ఏం చేస్తావు నాన్నా... అని నా కొడుకు అడిగాడు. సెలవులకు ఇంటికి రాగానే మళ్లీ అ దే ప్రశ్న వేశాడు. ఏదో ఒకటి చేసి చదివిస్తా అన్నాను. తన చదువు కోసం తండ్రి, కుటుంబం కొవ్వొత్తిలా కరిగిపోవడం ఇష్టంలేక పిల్లవాడు ఆత్మహత్య చేసుకున్నాడ’ని చెప్పాడు. ఆ రోజు నేను అనుకున్న కార్యక్రమాన్ని దేవుడి దయతో, అందరి ఆశీర్వాదంతో అమలు చేస్తు న్నాం’’ అని సీఎం జగన్ అన్నారు.
కొత్త ఒరవడికి నాంది
‘‘తల్లులు ఫీజులు కట్టడం వల్ల కాలేజీలను వారు అడగ్గలరు. టీచింగ్ స్టాఫ్ బాగా లేకపోయినా, వసతు లు లేకున్నా ప్రశ్నించే అవకాశం వస్తుంది. 3నెలలకోసారి డబ్బు కట్టడానికి వెళ్లడంవల్ల పిల్లలెలా చదువుతున్నారో తెలుసుకునే అవకాశముంటుంది. ఇది కొత్త ఒరవడికి నాంది పలుకుతుందని సగర్వంగా తెలియజేస్తున్నాం. అలాగే విద్యాదీవెన పథకాన్ని కూడా ప్రారంభించాం. పిల్లలకు బోర్డింగ్, లాడ్జింగ్ కోసం ఏడాదికి రూ.20 వేల వరకూ ఇస్తున్నాం.
కాలేజీలు ఆ డబ్బు వెనక్కివ్వాలి
‘‘కరోనా లాంటి కష్టాలున్నా మా ఇబ్బందుల కన్నా మీ ఇబ్బందులు పెద్దవని భావిస్తున్నాం. గడచిన సంవత్సరాల్లో అడ్మిషన్లు తీసుకున్నవారే కాకుండా పై తరగతులు చదువుతున్న వారికీ సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేస్తున్నాం. స్పెషల్ ఫీజులు, ఇతరత్రా ఫీజులూ ఉండవు. ఇప్పటికే ఎవరైనా ఫీజు కట్టి ఉం టే.. ఇప్పుడు కాలేజీ యాజమాన్యాలకు పూర్తి ఫీజులు చెల్లిస్తున్నాం కాబట్టి ఆ డబ్బును తల్లిదండ్రులకు వెన క్కు ఇవ్వాలి. తల్లిదండ్రులకు లేఖలు రాశాం. వలంటీర్ల ద్వారా అవి చేరతాయి. కాలేజీల్లో సదుపాయాలు, మౌలిక వసతులు సరిగ్గా లేవని భావిస్తే తల్లులు 1902 నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యను చెప్పవచ్చు. ఉన్నత విద్యాశాఖలో కాల్సెంటర్ ఉంటుంది. ఏ సమస్యలున్నా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది’’ అని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, అధికారులు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment