ఆరోగ్య సేతు APP ను ప్రతి ప్రభుత్వ ఉద్యోగి విధిగా Download చేసుకోవాలి అని G.O నంబరు 254 జారీచేసిన ప్రభుత్వం.
ఉద్యోగులకు ‘ఆరోగ్య సేతు’ యాప్ తప్పనిసరి!
ఉద్యోగులకు ‘ఆరోగ్య సేతు’ యాప్ తప్పనిసరి!
దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇక తప్పనిసరిగా ‘ఆరోగ్యసేతు’ యాప్ ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిరోజు ఈ యాప్ ద్వారా తమ ఆరోగ్య సమాచారాన్ని పరీక్షించుకోవాలని పేర్కొంది. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులు తమ కార్యాలయాలకు బయలుదేరే ముందు ‘ఆరోగ్య సేతు’ యాప్లో వివరాలు నమోదుచేసుకొని వారి ఆరోగ్య పరిస్థితి సమీక్షించుకోవాలి. ఆ సమయంలో బ్లూటూత్ సహాయంతో తమ సమీప ప్రాంత సమాచారంతో ఆ యాప్ విశ్లేషిస్తుంది. అనంతరం ‘సేఫ్’ అని సూచిస్తేనే ఉద్యోగి వారి కార్యాలయానికి బయలుదేరాలి. సమీపకాలంలో కరోనా సోకిన వ్యక్తితో కలిసి మాట్లాడుతే మాత్రం తీవ్రతను బట్టి మోడరేట్, హై రిస్క్ అని సూచిస్తుంది. ఇలాంటివారు మాత్రం అధికారులకు సమాచారం ఇవ్వడంతోపాటు 14రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కేంద్రప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది.
కరోనా కట్టడిలో ఈ యాప్కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఇప్పటికే పలు రాష్ట్రాలు కూడా తమ ఉద్యోగులను తప్పనిసరిగా ఈ యాప్ను వాడాలని సూచించాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఈ యాప్ వినియోగం పెరిగింది.
ఉద్యోగులకు ‘ఆరోగ్య సేతు’ యాప్ తప్పనిసరి!
ఉద్యోగులకు ‘ఆరోగ్య సేతు’ యాప్ తప్పనిసరి!
దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇక తప్పనిసరిగా ‘ఆరోగ్యసేతు’ యాప్ ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిరోజు ఈ యాప్ ద్వారా తమ ఆరోగ్య సమాచారాన్ని పరీక్షించుకోవాలని పేర్కొంది. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులు తమ కార్యాలయాలకు బయలుదేరే ముందు ‘ఆరోగ్య సేతు’ యాప్లో వివరాలు నమోదుచేసుకొని వారి ఆరోగ్య పరిస్థితి సమీక్షించుకోవాలి. ఆ సమయంలో బ్లూటూత్ సహాయంతో తమ సమీప ప్రాంత సమాచారంతో ఆ యాప్ విశ్లేషిస్తుంది. అనంతరం ‘సేఫ్’ అని సూచిస్తేనే ఉద్యోగి వారి కార్యాలయానికి బయలుదేరాలి. సమీపకాలంలో కరోనా సోకిన వ్యక్తితో కలిసి మాట్లాడుతే మాత్రం తీవ్రతను బట్టి మోడరేట్, హై రిస్క్ అని సూచిస్తుంది. ఇలాంటివారు మాత్రం అధికారులకు సమాచారం ఇవ్వడంతోపాటు 14రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కేంద్రప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది.
కరోనా కట్టడిలో ఈ యాప్కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఇప్పటికే పలు రాష్ట్రాలు కూడా తమ ఉద్యోగులను తప్పనిసరిగా ఈ యాప్ను వాడాలని సూచించాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఈ యాప్ వినియోగం పెరిగింది.
0 Comments:
Post a Comment