ముంబయి: తాను ఎదుర్కొన్న ప్రపంచ అత్యుత్తమ అయిదు ఆల్రౌండర్లను దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ ప్రకటించాడు. ''ప్రపంచ టాప్-5 ఆల్రౌండర్లను చూస్తూ పెరిగాను. వారిలో కపిల్దేవ్ ఒకరు. అతడితో కలిసి ఆడాను. రెండో వ్యక్తి ఇమ్రాన్ ఖాన్. పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినప్పుడు అతడిని ఎదుర్కొన్నాను. మూడో ఆల్రౌండర్ సర్ రిచర్డ్ హాడ్లీ. రెండోసారి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు అతడితో ఆడాను. అలాగే ఆస్ట్రేలియాలో టోర్నీ సందర్భంగా విండీస్ ఆటగాడు మాల్కమ్ మార్షల్, ఇంగ్లాండ్ క్రీడాకారుడు ఇయాన్ బోథమ్ను ఎదుర్కొన్నాను. వాళ్లంతా నా అత్యుత్తమ ఆల్రౌండర్లు. వారిని చూస్తూ పెరిగాను.
అంతేకాక వారితో కలిసి ఆడే అవకాశం కూడా దక్కింది'' అని స్టార్స్పోర్ట్స్కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సచిన్ తెలిపాడు.
సచిన్ శుక్రవారం 47వ వసంతంతోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఐసీసీ సచిన్ అత్యుత్తమ ఇన్నింగ్స్ తెలపాలని నెటిజన్లకు ఓ పోల్ నిర్వహించింది. దీనిలో 1998లో షార్జా వేదికగా ఆసీస్పై సాధించిన ఇన్నింగ్స్ను నెటిజన్లు ఎంపిక చేశారు. ఆ మ్యాచ్లో సచిన్ 131 బంతుల్లో 143 పరుగులు సాధించాడు. 9 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. అయితే ఇసుక తుపాను మ్యాచ్కు ఆటంకం కలగడంతో లక్ష్యాన్ని 46 ఓవర్లలో 277 పరుగులుగా నిర్ణయించారు. కానీ భారత్ 26 పరుగుల తేడాతో ఓటమిపాలైంది
0 Comments:
Post a Comment