జనవరి 22 వరకు జంగూబాయి జాతర
ప్రకృతి ఓ పాఠశాల. నాగరికత పుట్టుక, ఆచార, వ్యవహారాలు, సంప్రదాయాలు... అన్నీ అందులో అంతర్లీనమే. బతుకు, మెతుకు పోరాటంలో ప్రకృతినే దైవంగా భావించే ఆదివాసీల ఇంటి దీపం జంగూబాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ తెగలకు ఈ దేవతే ఆరాధ్యదైవం.
ఉ మ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని కెరమెరి మండలం పాట పరందోళి- మహారాజ్గూడ అటవీ ప్రాంతంలో ఓ గుహలో జంగూబాయి ఓ దీపం రూపంలో కొలువై ఉంటుంది.
సాక్షాత్తు శంకరుడే ఈ దేవతకు ఇక్కడి పెద్ద కొండలో జీవం పోశాడని నమ్ముతారు. ఆ దేవతను గురించి బయటి ప్రపంచానికి తెలియజేసిన పాండికుపార్ లింగో అనే భక్తుడి పేరును కూడా కలిపి ఈ దేవతను జై జంగో -జై లింగో అని పిలుస్తారు.
ఏటా ఫుష్యమాసంలో జంగూబాయికి జాతర జరుగుతుంది. పుష్య మాసంలో వచ్చే అమావాస్య మొదలుకొని మాఘమాస అమవాస్య వరకు ఈ జాతర కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా జరిగే గిరిజన జాతరలన్నిటికీ ఈ సంబరంతోనే అంకురార్పణ జరుగుతుంది. దాదాపు 750 రకాల తెగలకు సంబంధించిన పండగలకు, వేడుకలకు ఈ జాతర దిక్సూచి అవుతుంది. తుడుం మోతలు, సన్నాయి స్వరాలు, కట్టుబాట్ల మధ్య జరిగే ఈ జాతరలో నవీనపోకడలకు అస్సలు తావుండదు. అమ్మవారికి సమర్పించే... నైవేద్యం కూడా శాకాహారమే.
నెల రోజుల పాటు జరిగే ఈ జాతర దట్టమైన అటవీ ప్రాంతంలో జరుగుతుంది. నియమ, నిష్టలతో ఎన్నో కష్టాలను ఓర్చుకుని ఇక్కడకు చేరుకునే భక్తులు దీపం రూపంలో ఉన్న అమ్మను శరణువేడి అక్కడి నుంచి బయల్దేరతారు.
ప్రకృతి ఓ పాఠశాల. నాగరికత పుట్టుక, ఆచార, వ్యవహారాలు, సంప్రదాయాలు... అన్నీ అందులో అంతర్లీనమే. బతుకు, మెతుకు పోరాటంలో ప్రకృతినే దైవంగా భావించే ఆదివాసీల ఇంటి దీపం జంగూబాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ తెగలకు ఈ దేవతే ఆరాధ్యదైవం.
ఉ మ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని కెరమెరి మండలం పాట పరందోళి- మహారాజ్గూడ అటవీ ప్రాంతంలో ఓ గుహలో జంగూబాయి ఓ దీపం రూపంలో కొలువై ఉంటుంది.
సాక్షాత్తు శంకరుడే ఈ దేవతకు ఇక్కడి పెద్ద కొండలో జీవం పోశాడని నమ్ముతారు. ఆ దేవతను గురించి బయటి ప్రపంచానికి తెలియజేసిన పాండికుపార్ లింగో అనే భక్తుడి పేరును కూడా కలిపి ఈ దేవతను జై జంగో -జై లింగో అని పిలుస్తారు.
ఏటా ఫుష్యమాసంలో జంగూబాయికి జాతర జరుగుతుంది. పుష్య మాసంలో వచ్చే అమావాస్య మొదలుకొని మాఘమాస అమవాస్య వరకు ఈ జాతర కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా జరిగే గిరిజన జాతరలన్నిటికీ ఈ సంబరంతోనే అంకురార్పణ జరుగుతుంది. దాదాపు 750 రకాల తెగలకు సంబంధించిన పండగలకు, వేడుకలకు ఈ జాతర దిక్సూచి అవుతుంది. తుడుం మోతలు, సన్నాయి స్వరాలు, కట్టుబాట్ల మధ్య జరిగే ఈ జాతరలో నవీనపోకడలకు అస్సలు తావుండదు. అమ్మవారికి సమర్పించే... నైవేద్యం కూడా శాకాహారమే.
నెల రోజుల పాటు జరిగే ఈ జాతర దట్టమైన అటవీ ప్రాంతంలో జరుగుతుంది. నియమ, నిష్టలతో ఎన్నో కష్టాలను ఓర్చుకుని ఇక్కడకు చేరుకునే భక్తులు దీపం రూపంలో ఉన్న అమ్మను శరణువేడి అక్కడి నుంచి బయల్దేరతారు.
Jai....jangubai
ReplyDelete