అమ్మ ఒడి -వారోత్సవాల చివరి రోజు(జనవరి 9) నిర్వహించే కార్యక్రమాల వివరాలు.
➡జగనన్న అమ్మ ఒడి’ పథకం ప్రారంభోత్సవం.
➡అర్హులైన తల్లులు/సంరక్షకులని పాఠశాలలకు ఆహ్వానించాలి.
➡గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్ధాయి ప్రజాప్రతినిధులను కూడా ప్రారంభోత్సవ సమావేశానికి ఆహ్వానించాలి.
➡ఈ కార్యక్రమాన్ని రాష్ట్రస్ధాయిలో సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తున్నందున కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రతి పాఠశాలలో పిల్లలు, తల్లిదండ్రులు చూసేందుకు వీలుగా ఏర్పాటు చేయాలి.
➡ప్రారంభోత్సవాన్ని పండుగను తలపించేలా వేడుకలాగా నిర్వహించాలి.
చిత్తూరులో సీఎం వైఎస్ జగన్ పర్యటన వివరాలు..
➡ ఉదయం 9 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు.➡ 11.15 గంటలకు చిత్తూరు పీవీకేఎన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్ సభా ప్రాంగణం వద్దకు సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారు.
➡ 11.15 -11.35 : పాఠశాల విద్యాశాఖ ఏర్పాటుచేసిన స్టాల్స్ను సీఎం వైఎస్ జగన్ పరిశీలిస్తారు.
➡ 11.35 -11.40 : స్ధానిక అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్ధాపన కార్యక్రమాల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు.
➡ 11.45- 1.45 : అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొనున్న సీఎం వైఎస్ జగన్.. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
➡ తిరిగి 3.45 గంటలకు సీఎం తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.
‘జగనన్న అమ్మ ఒడి’ పథకం ద్వారా పేదింటి పిల్లల చదువులు సాకారం అవుతాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పేదింటి తల్లులు తమ పిల్లలను బడికి పంపి మంచి చదువులు చదివించుకొనేందుకు ఏటా రూ.15 వేలు
నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయిస్తున్నామని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని వారి పిల్లలు మరింత వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు.
రేపు 9 వ తేదీన అమ్మ ఒడి ప్రారంభం సందర్భం గా
పాఠశాల లో వీటిని తల్లిదండ్రులకు ,విద్యార్థులకు తెలియచేయాలి...
డౌన్లోడ్......CM TALKING POINTS
0 Comments:
Post a Comment