మౌఖిక పరీక్షల్లేవ్
రాత పరీక్షలతోనే ‘గ్రామ సచివాలయ’ ఎంపికలు
నిమిషం నిబంధన కచ్చితం
‘ఈనాడు’ ముఖాముఖిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనరు గిరిజా శంకర్
ఈనాడు - అమరావతి
మౌఖిక పరీక్షల్లేవ్
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు రాత పరీక్షల ద్వారానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని, మౌఖిక (ఇంటర్వ్యూలు) పరీక్షలు ఉండబోవని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనరు గిరిజా శంకర్ వెల్లడించారు. రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సెప్టెంబరు 1 నుంచి 8వ తేదీ మధ్య 19 రకాల పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలను రాసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 21,69,719 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరికోసం 6వేలకుపైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పంచాయతీరాజ్, పురపాలకశాఖల ఆధ్వర్యంలో తాడేపల్లిలో మంగళవారం పరీక్షల నిర్వహణపై జరిగిన కార్యశాల సందర్భంగా గిరిజా శంకర్ ‘ఈనాడు ప్రతినిధి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలివీ...
కనీసం 30 కిలోమీటర్ల పరిధిలో...
అభ్యర్థులు దరఖాస్తుల్లో పేర్కొన్న చిరునామాల ఆధారంగా మండలాలను క్లస్టర్లుగా విభజించి పరీక్షా కేంద్రాలను కేటాయించాం. కనీసం 30 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణం చేయాల్సి రావొచ్చు. అభ్యర్థులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్టీసీ బస్సులను నడుపుతాం. ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు రాసే అభ్యర్థులకు ఒకే కేంద్రాన్ని కేటాయించాం. అభ్యర్థులకు అందజేసే హాల్టికెట్లలో కేంద్రాల చిరునామా స్పష్టంగా ఉంటుంది. వారి సెల్ఫోన్లకు పరీక్షా కేంద్రాన్ని గుర్తించే వెబ్లింకును పంపుతాం. దీనిని క్లిక్ చేస్తే గూగుల్ మ్యాప్ ద్వారా పరీక్షా కేంద్రాన్ని గుర్తించవచ్చు. ప్రారంభం రోజునే అంటే 1వ తేదీనే (కేటగిరీ-1) గరిష్ఠంగా 12.54 లక్షల మంది పరీక్షలు రాయబోతున్నారు.
ర్యాండమ్ విధానంలో ఇన్విజిలేటర్ల ఎంపిక
ర్యాండమ్ విధానంలో ఇన్విజిలేటర్ల ఎంపిక జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్/సెకండరీ గ్రేడ్ టీచర్ స్థాయివారు ఇన్విజిలేటర్లుగా ఉంటారు. వారికి వారం రోజుల ముందుగా తెలియజేస్తాం. కానీ కేటాయించిన కేంద్రాల గురించి పరీక్షల నిర్వహణ ముందు రోజే తెలుస్తుంది. ర్యాండమ్ విధానంలోనే పరీక్షల నిర్వహణ బాధ్యతలను అధికారులకు కలెక్టర్లు కేటాయిస్తారు.
ఓఎంఆర్ షీటు ప్రతి
సాంకేతిక పాఠ్యాంశాలకు సంబంధించిన రాత పరీక్షలే ఎక్కువగా ఉన్నాయి. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ప్రశ్నలిస్తున్నాం. జవాబులు గుర్తించిన ఓఎంఆర్ షీటు ప్రతిని అభ్యర్థులు వెంట తీసుకెళ్లొచ్చు. రుణాత్మక (మైనస్) మార్కులున్నాయి. పరీక్షలు జరిగే రోజు సాయంత్రమే ప్రాథమిక ‘కీ’ విడుదలవుతుంది. అభ్యంతరాలను నిపుణుల బృందాలు పరిశీలిస్తాయి. అక్టోబరు 2వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల ఎంపికైనవారు విధుల్లో చేరతారు.
కమాండ్ కంట్రోల్
రాజధానిలోనూ, ప్రతి జిల్లా కేంద్రంలోనూ కమాండ్ కంట్రోల్ వ్యవస్థల ద్వారా పరీక్షలపై పర్యవేక్షణ ఉంటుంది. నిర్వహణ సమయంలో అధికారులు తప్పిదాలు చేస్తే శాఖాపరంగా కఠిన చర్యలుంటాయి. పరీక్షల నిర్వహణకు ఒక్కో అభ్యర్థిపై కనీసం రూ.150 వరకు ఖర్చవుతోంది. మొత్తమ్మీద రూ.30 కోట్లు అవుతోంది. ప్రశ్నపత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్రూంలు సీసీ కెమెరాల నిఘాలో ఉంటాయి.
సమయం దాటితే అనుమతి లేదు
సెప్టెంబరు 1 నుంచి 6 రోజులపాటు రాత పరీక్షలు జరుగుతాయి. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలుంటాయి. అభ్యర్థులు కనీసం గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష ప్రారంభమైన తరువాత నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను అనుమతించేదిలేదు.
రాత పరీక్షలతోనే ‘గ్రామ సచివాలయ’ ఎంపికలు
నిమిషం నిబంధన కచ్చితం
‘ఈనాడు’ ముఖాముఖిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనరు గిరిజా శంకర్
ఈనాడు - అమరావతి
మౌఖిక పరీక్షల్లేవ్
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు రాత పరీక్షల ద్వారానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని, మౌఖిక (ఇంటర్వ్యూలు) పరీక్షలు ఉండబోవని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనరు గిరిజా శంకర్ వెల్లడించారు. రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సెప్టెంబరు 1 నుంచి 8వ తేదీ మధ్య 19 రకాల పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలను రాసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 21,69,719 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరికోసం 6వేలకుపైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పంచాయతీరాజ్, పురపాలకశాఖల ఆధ్వర్యంలో తాడేపల్లిలో మంగళవారం పరీక్షల నిర్వహణపై జరిగిన కార్యశాల సందర్భంగా గిరిజా శంకర్ ‘ఈనాడు ప్రతినిధి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలివీ...
కనీసం 30 కిలోమీటర్ల పరిధిలో...
అభ్యర్థులు దరఖాస్తుల్లో పేర్కొన్న చిరునామాల ఆధారంగా మండలాలను క్లస్టర్లుగా విభజించి పరీక్షా కేంద్రాలను కేటాయించాం. కనీసం 30 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణం చేయాల్సి రావొచ్చు. అభ్యర్థులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్టీసీ బస్సులను నడుపుతాం. ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు రాసే అభ్యర్థులకు ఒకే కేంద్రాన్ని కేటాయించాం. అభ్యర్థులకు అందజేసే హాల్టికెట్లలో కేంద్రాల చిరునామా స్పష్టంగా ఉంటుంది. వారి సెల్ఫోన్లకు పరీక్షా కేంద్రాన్ని గుర్తించే వెబ్లింకును పంపుతాం. దీనిని క్లిక్ చేస్తే గూగుల్ మ్యాప్ ద్వారా పరీక్షా కేంద్రాన్ని గుర్తించవచ్చు. ప్రారంభం రోజునే అంటే 1వ తేదీనే (కేటగిరీ-1) గరిష్ఠంగా 12.54 లక్షల మంది పరీక్షలు రాయబోతున్నారు.
ర్యాండమ్ విధానంలో ఇన్విజిలేటర్ల ఎంపిక
ర్యాండమ్ విధానంలో ఇన్విజిలేటర్ల ఎంపిక జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్/సెకండరీ గ్రేడ్ టీచర్ స్థాయివారు ఇన్విజిలేటర్లుగా ఉంటారు. వారికి వారం రోజుల ముందుగా తెలియజేస్తాం. కానీ కేటాయించిన కేంద్రాల గురించి పరీక్షల నిర్వహణ ముందు రోజే తెలుస్తుంది. ర్యాండమ్ విధానంలోనే పరీక్షల నిర్వహణ బాధ్యతలను అధికారులకు కలెక్టర్లు కేటాయిస్తారు.
ఓఎంఆర్ షీటు ప్రతి
సాంకేతిక పాఠ్యాంశాలకు సంబంధించిన రాత పరీక్షలే ఎక్కువగా ఉన్నాయి. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ప్రశ్నలిస్తున్నాం. జవాబులు గుర్తించిన ఓఎంఆర్ షీటు ప్రతిని అభ్యర్థులు వెంట తీసుకెళ్లొచ్చు. రుణాత్మక (మైనస్) మార్కులున్నాయి. పరీక్షలు జరిగే రోజు సాయంత్రమే ప్రాథమిక ‘కీ’ విడుదలవుతుంది. అభ్యంతరాలను నిపుణుల బృందాలు పరిశీలిస్తాయి. అక్టోబరు 2వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల ఎంపికైనవారు విధుల్లో చేరతారు.
కమాండ్ కంట్రోల్
రాజధానిలోనూ, ప్రతి జిల్లా కేంద్రంలోనూ కమాండ్ కంట్రోల్ వ్యవస్థల ద్వారా పరీక్షలపై పర్యవేక్షణ ఉంటుంది. నిర్వహణ సమయంలో అధికారులు తప్పిదాలు చేస్తే శాఖాపరంగా కఠిన చర్యలుంటాయి. పరీక్షల నిర్వహణకు ఒక్కో అభ్యర్థిపై కనీసం రూ.150 వరకు ఖర్చవుతోంది. మొత్తమ్మీద రూ.30 కోట్లు అవుతోంది. ప్రశ్నపత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్రూంలు సీసీ కెమెరాల నిఘాలో ఉంటాయి.
సమయం దాటితే అనుమతి లేదు
సెప్టెంబరు 1 నుంచి 6 రోజులపాటు రాత పరీక్షలు జరుగుతాయి. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలుంటాయి. అభ్యర్థులు కనీసం గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష ప్రారంభమైన తరువాత నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను అనుమతించేదిలేదు.
0 Comments:
Post a Comment