పిఎఫ్ ఖాతాదారులకు శుభవార్త...8.65 శాతం వడ్డీ...పీఎఫ్పై 8.65శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సుముఖంగా ఉందన్నారు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్. 2018-19 ఆర్థిక సంవత్సరానికిగానూ ఉద్యోగ భవిష్యనిధి డిపాజిట్లపై వడ్డీని 8.65 శాతంగా నిర్ణయిస్తూ కార్మిక మంత్రిత్వశాఖ ప్రకటన వెలువరించబోతున్నట్టు ఆయన చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టు తెలిపారు మంత్రి గంగ్వార్. కేంద్రం నిర్ణయంతో ఆరుకోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు లబ్ది చేకూరబోతుందని మంత్రి తెలిపారు.
ఇదిలా ఉంటే ఫిబ్రవరి నెలలో మంత్రి సంతోష్ గంగ్వార్ నేతృత్వంలో ఈపీఎఫ్వో కేంద్ర ధర్మకర్తల మండలి సమావేశమై వడ్డీ పెంచేందుకు ఆమోదం తెలిపారు.
0 Comments:
Post a Comment