MANNAMweb...AP Teachers info website/AP DSC 2018-TET CUM TRT 2018

Search This Blog

Sunday, 24 September 2023

Google Images History : గూగూల్ ఇమేజస్‌ పుట్టడానికి కారణమైన ఫోటో ఏంటో మీకు తెలుసా?



Google Images History : సామాన్యులు, పొలిటికల్ లీడర్లు, సినిమా యాక్టర్లు, ప్రాంతాలు అసలు గూగుల్‌లో వెతికితే దొరకని ఫోటోలు ఉండవు. ఈజీగా సెర్చ్ చేసి చూసేస్తాం.

2001 వరకు గూగుల్ ఇమేజస్ ఆప్షన్ లేనే లేదు. గూగుల్ ఇమేజస్ అందుబాటులోకి రావడానికి కారణం ఓ ముద్దుగుమ్మ వేసుకున్న గ్రీన్ డ్రెస్. ఎవరా లేడీ? ఆ గ్రీన్ డ్రెస్ హిస్టరీ ఏంటి?

అమెరికన్ పాపులర్ నటి, సింగర్ జెన్నిఫర్ లోపెజ్ గురించి తెలియని వారుండరు. ఈ రోజు మనం గూగుల్‌కి వెళ్లి ఫోటోలు వెతకడానికి కారణం ఈ సెలబ్రిటీనే. 2000 ఫిబ్రవరిలో గ్రామీ అవార్డుల వేడుక జరిగింది. 

ఆ కార్యక్రమంలో జెన్నిఫర్ లోపెజ్ గ్రీన్ గౌనులో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఈ అందమైన గౌనులో జెన్నిఫర్‌ను చూసిన నెటిజన్లు ఆమె ఫోటో కోసం ఓ రేంజ్‌లో వెతకడం మొదలుపెట్టారు.

 నెటిజన్ల వెతుకులాట చూసి గూగుల్ ఆశ్చర్యపోయింది. వెంటనే ఈ సమస్యకు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యింది.

గూగుల్ సెర్చింజన్ 1998 లో మొదలైంది. గూగుల్ ఇమేజస్ మాత్రం 2001 జూలై నుండి అందుబాటులోకి వచ్చింది. అదీ జెన్నిఫర్ ఎఫెక్ట్‌తో అన్నమాట. 

ఇక ఈ గ్రీన్ గౌను పాపులారిటీ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. రీసెంట్‌గా ఇటలీలో జరిగిన ఫ్యాషన్ వీక్‌లో జెన్నిఫర్ కొంచెం మార్పులు చేసిన ఇదే గ్రీన్ గౌనుతో ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేసారు. 

ఇక జెన్నీ క్యాట్ వాక్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. లక్షలాది మందిని ఆకట్టుకుంది.

Black turmeric : నల్ల పసుపు .. దీని గురించి తెలిస్తే తప్పక ఆశ్చర్యపోతారు



Uses of Black Turmeric: పసుపు జాతులలో, అంతరించిపోతున్న జాతి నల్లపసుపు . ఇది అధిక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. 

ఇది మధ్య ప్రదేశ్ లోని నర్మదా నదీ ప్రాంతంలోను, ఈశాన్య రాష్ట్రాలలోనూ, అరుదుగా తూర్పు కనుమలలోనూ, నేపాల్ లోను లభిస్తుంది..

దీని దుంప లోపలి భాగం ముదురు నీలం -నలుపు సమ్మేళనంతో ఉంటుంది. పువ్వు ముదురు పింక్ రంగులో ఉంటుంది. కాళీమాత పూజలో వాడే ఈ రకం పసుపుని హిందీలో కాలీ హాల్దీ అని పిలుస్తారు. కాలీ అంటే నలుపు ఆని అర్ధం. 

అందుకే ఈ రకం పసుపుకి నల్లపసుపు అని పేరు వచ్చింది. నల్ల పసుపు తాంత్రిక, వశీకరణ చర్యల కోసం ఉపయోగించే అరుదుగా దొరికే ఒక విధమైన పసుపు. 

ముఖ్యంగా నల్లపసుపు దుంపను తాంత్రిక విద్యల్లో వాడతారు. వశీకరణ చర్యలకు ఛత్తీస్ గడ్ కేశ్కల్ కొండ ప్రాంతాల్లో తాంత్రికులు నల్ల పసుపును ఆవు మూత్రంతో పేస్టులా చేసి దానిని నుదుటికి కుంకుమ వలె పెట్టుకుంటారు. నల్ల పసుపు మొక్కను నీలకంఠ, నరకచూర, కృష్ట కేదార అని కూడా పిలుస్తారు.

ఈ మొక్క దుంపలను సౌందర్య వస్తువులు (కాస్మెటిక్స్) తయారీలో ఉపయోగిస్తారు. నల్ల పసుపు రుచికి చేదుగా ఉంటుంది. దీనిని పైల్స్ చికిత్సలో ఉపయోగిస్తారు. గిరిజన స్త్రీలు రుతు క్రమ రుగ్మతలకు సంబంధించి దీనిని వినియోగిస్తారు. 

గిరిజన ప్రజలుజ్వరం, వాంతులు, విరేచనాలు, కణితులు మరియుద్వితీయ లైంగిక వ్యాధులు, మంట మొదలైనవాటి చికిత్సకు దీనిని ఉపయోగిస్తారు.న్యుమోనియా, దగ్గు మరియు పిల్లలలో జలుబు చికిత్సల కోసం కూడా ఉపయోగిస్తారు.

 నల్ల పసుపు బెండు తాజాపేస్ట్‌నుతేలు మరియు పాముకాటుకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఇందులో ఉండే కొన్ని కారకాలు ల్యూకోడెర్మా, మూర్ఛ,క్యాన్సర్ మరియు హెచ్‌ఐవికి వ్యతిరేకంగా పని చేస్తాయి. దీనిని ఉపయోగించడం ద్వారా మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. 

అస్సాం రాష్ట్రంలో దీనిని ఆవాల నూనెతో కలిపి పశువుల విరేచనాలకు విరుగుడుగా వాడతారు. నల్ల పసుపు పేస్టును తేనె లేదా పాలతో కలిపి తీసుకుంటే జీర్ణకోశ, శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Gas Cylinder: గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే ఈ చిట్కాలు పాటించండి..!



వంటగ్యాస్ ఎక్కువ కాలం ఉండదని పలువురు వాపోతున్నారు. కొన్ని సిలిండర్లు ఒక్క నెల పాటే వస్తుంటాయి. మరికొన్ని సార్లు ఒక నెల కన్నా... అంతకు ముందు కూడా ఖాళీ అయిపోతాయి.

ప్రస్తుతం దేశంలోని చాలా ఇళ్లలో గ్యాస్‌తో వంట చేస్తున్నారు. అయితే పెరుగుతున్న వంటగ్యాస్ ధరలతో మధ్యతరగతి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అటువంటి పరిస్థితిలో, ప్రతి ఒక్కరూ గ్యాస్ ఆదా చేయాలనుకుంటున్నారు.

చిన్న చిన్న విషయాలను దృష్టిలో ఉంచుకుని వంటగ్యాస్‌ను ఆదా చేయడం సాధ్యపడుతుంది. చిన్న చిన్న పొరపాట్లు మన వంట గ్యాస్ ఖర్చులను పెంచుతాయి.

తక్కువ సమయంలో ఉడికించేందుకు ప్రెషర్ కుక్కర్ లేదు. గ్యాస్ ఆదా చేయడానికి మీరు దానిలో కొంత వంట చేయవచ్చు. అవసరమైతే రైస్ కుక్కర్ ఉపయోగించండి.

గ్యాస్ బర్నర్‌ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి. బర్నర్ నుండి నీలిరంగు మంట వస్తుంది అంటే అది శుభ్రంగా ఉంది. బర్నర్ మురికిగా ఉంటే, గ్యాస్ ఎక్కువగా వినియోగించబడుతుంది.

మీరు కూరగాయలు ఉడికించిన రోజు, వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇది కూరగాయలను త్వరగా వండుతుంది. గ్యాస్ ఆదా అవుతుంది.

వంటలను చాలా వరకు కవర్ చేయడానికి ప్రయత్నించండి. దానిలో ఉత్పన్నమయ్యే వేడి ఆవిరైపోదు. ఫలితంగా గ్యాస్ ఆదా అవుతుంది.

గ్యాస్ ఓవెన్‌లో తడి వంటసామాను ఎప్పుడూ ఉడికించవద్దు. డిష్ వేడి చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా, గ్యాస్ మరింత మండుతుంది.

 ముందుగానే వంట వస్తువులను సిద్ధం చేయడం మంచిది. బియ్యం మరియు కోడిగుడ్లను ముందుగా నానబెట్టడం వల్ల గ్యాస్ ఆదా అవుతుంది.

Wednesday, 20 September 2023

AP Cabinet - ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం.. కేబినెట్‌ భేటీలో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం..

కేబినెట్‌ భేటీలో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

*®️►విజయదశమ నంచి విశాఖ నుంచే పాలన

*®️►అప్పటివరకూ కార్యాలయాలను తరలించాలని నిర్ణయం

*®️►కమిటీ సూచనల మేరకు కార్యాలయాల ఏర్పాటు

*®️►ముందస్తు, జమిలి ఎన్నికలపై కేంద్రం నిర్ణయం ప్రకారమే ముందుకు వెళతాం

*®️►ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

®️*►ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్‌ బిల్లు అమలుకు కేబినెట్‌ ఆమోదం

*®️►ఉద్యోగి రిటైర్డ్‌ అయిన సమయానికి ఇంటి స్తలం లేని వారికి కచ్చితంగా ఇంటిస్థలం ఉండాలి..ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి

*®️►రిటైర్డ్‌ అయిన తర్వాత ఉద్యోగులు వారి పిల్లలకు ఆరోగ్యశ్రీ కింద కవర్‌ అయ్యేలా చూడాలి


*ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం*


 *ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం* .. 


►ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం


►ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్‌ బిల్లు అమలుకు కేబినెట్‌ ఆమోదం


►ఉద్యోగి రిటైర్డ్‌ అయిన సమయానికి ఇంటి స్తలం లేని వారికి కచ్చితంగా ఇంటిస్థలం ఉండాలి..ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి


►రిటైర్డ్‌ అయిన తర్వాత ఉద్యోగులు వారి పిల్లలకు ఆరోగ్యశ్రీ కింద కవర్‌ అయ్యేలా చూడాలి


►ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. 


49 అంశాల పై చర్చించిన ఏపీ కేబినెట్‌.. వాటిలో ప్రధానమైన అంశాలు


►జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పధకం ఏర్పాటుకి ఆమోదం తెలపనున్న కేబినెట్‌.


► సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఈ పధకం ద్వారా లబ్ది, UPSC లో ప్రిలిమ్స్, mains ఉత్తీర్ణత సాధించిన వారికి 50 వేల నుంచి లక్ష ఆర్ధిక సాయం తదితర అంశాలపై చర్చ


►కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వ ఉద్యోగుల కు  జిపిఎస్ అమలు ముసాయిదా బిల్లుల పై చర్చ


►ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లు పై చర్చ


►జగనన్న ఆరోగ్య సురక్షపై చర్చించనున్న కేబినెట్‌


►కురుపం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదన పై చర్చ


►ఆంధ్రప్రదేశ్ ఆధార్ సవరణ బిల్లుపై చర్చ


►పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణంకి ఆమోదం తెలపనున్న కేబినెట్‌


►అసైన్డ్ భూములు క్రమబద్ధీకరణకు పీఓటీ చట్ట సవరణ కు ఆమోదం తెలపనున్న కేబినెట్‌


►భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుపై చర్చ

►దేవాదాయ చట్ట  సవరణపై  చర్చించనున్న క్యాబినెట్.

Sunday, 17 September 2023

RBI ఆర్‌బీఐ కొత్త రూల్స్‌ : హోమ్‌లోన్‌పై రూ. 33 లక్షల వరకు ఆదా

 ఆర్‌బీఐ కొత్త రూల్స్‌ : హోమ్‌లోన్‌పై రూ. 33 లక్షల వరకు ఆదా

హోమ్ లోన్‌ ఖాతాదారులకు ఆర్‌బీఐ శుభవార్త చెప్పింది. ఆర్‌బీఐ అమల్లోకి తేనున్న కొత్త రూల్స్‌తో ఇంటి రుణాల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి.

ఫలితంగా రూ.50 లక్షల హోమ్‌లోన్‌పై చెల్లించే వడ్డీ రూ.33 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని తెలుస్తోంది. 


గత ఏడాది ఆర్‌బీఐ వరుస వడ్డీ రేట్ల పెంచుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే, వడ్డీ రేటు పెరిగినప్పుడు కస్టమర్లు నెలవారీ చెల్లించే ఈక్వేటెడ్ నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం నుంచి కాపాడేందుకు బ్యాంకులు టెన్యూర్‌ కాలాన్ని పెంచుతున్నాయి. అయితే, కొన్నిసార్లు ఈ పొడిగింపులు ఎక్కువ కాల కొనసాగడంతో రుణాలు చెల్లించే సమయంలో రుణ గ్రహితలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 


ఈ తరుణంలో రుణగ్రహీతల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, హోమ్‌లోన్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల కొన్ని రీపేమెంట్ నిబంధనలను రూపొందించింది . ఇందులో కొత్తదనం ఏమిటి? ఇది గృహ రుణ గ్రహీతలకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది? 

హోమ్‌లోన్లపై ఆర్‌బీఐ కొత్త ఆదేశాలు, చోటు చేసుకున్న మార్పులు


అయితే ఆగస్టు 18,2023న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో హౌస్‌లోన్‌ తీసుకున్న రుణదాతలు ఈఎంఐని పెంచడానికి లేదా లోన్ కాలపరిమితిని పొడిగించడానికి లేదా హోమ్ లోన్‌లపై వడ్డీ రేట్లను రీసెట్ చేసే సమయంలో రెండు ఆప్షన్‌లను ఉపయోగించుకోవచ్చని ఆర్‌బీఐ సూచించింది. 


1) ఈఎంఐ/టెన్యూర్‌..ఇలా రెండింటిలో మార్పుకు దారితీసే బెంచ్‌మార్క్ రేట్లలో మార్పుల్ని, వాటి ప్రభావాల్ని బ్యాంకులు ఇంటి రుణాలు తీసుకునే రుణగ్రహీతలకు తెలియజేయాలి.


2) వడ్డీ రీసెట్ సమయంలో, రుణగ్రహీతలకు స్థిర వడ్డీ రేటుకు మారే అవకాశం ఇవ్వాలి. ఫ్లోటింగ్ నుండి ఫిక్స్‌డ్‌కి మారడానికి వర్తించే అన్ని ఛార్జీలు లోన్ ప్రాసెసింగ్‌ సమయంలో వెల్లడించాలి.

3) రుణ గ్రహీతలకు లోన్ కాలపరిమితిని పొడిగించడానికి లేదా ఈఎంఐలలో మెరుగుదలను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలి. 


4) రుణదాతలు ఇంటి రుణంపై చెల్లించే ఈఎంఐ టెన్యూర్‌ కాలాన్ని పొడిగించడం వల్ల ప్రతికూల ఇబ్బందులు ఏర్పడకుండా చూసుకోవాలి. అంటే రుణాలు తీసుకునే సామర్ధ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా బ్యాంకులు రుణాలకు సంబంధించిన అంశాలపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదు. 


గృహ రుణాలపై కొత్త ఆర్‌బీఐ నియమం: ఇది రుణ గ్రహితలకు ఎలా ఉపయోగపడుతుంది?


ఉదాహరణకు మీరు 2020లో 20 సంవత్సరాలకు (240 నెలలు) 7% వడ్డీతో రూ. 50 లక్షల గృహ రుణాన్ని ఈఎంఐ చెల్లించడం ప్రారంభించారు అని అనుకుందాం. లోన్ తీసుకునే సమయంలో మీ నెలవారీ ఈఎంఐ నెలకు రూ. 38,765. మొత్తం వడ్డీ రూ.43.04 లక్షలు.

మూడేళ్ల తర్వాత వడ్డీ రేటు 9.25%కి పెరిగిందనుకుందాం. కొత్త ఆర్‌బీఐ ఆదేశం ప్రకారం, బ్యాంకులు మీ ఈఎంఐ లేదా టెన్యూర్‌ కాలాన్ని పెంచుకోవడానికి లేదా వడ్డీ రేటును రీసెట్ చేసేటప్పుడు పైన పేర్కొన్న రెండు ఆప్షన్‌లను ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలి. 


మీరు మీ 20 సంవత్సరాల లోన్‌ను మిగిలిన 17 సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేయాలనుకుంటే (3 సంవత్సరాలు గడిచినందున), మీ ఈఎంఐ నెలకు రూ. 44,978కి పెరుగుతుంది. మీరు లోన్ టెన్యూర్‌ ముగిసే సమయానికి మొత్తం రూ. 55.7 లక్షల వడ్డీ చెల్లించుకోవచ్చు. 


అయితే, మీరు మీ లోన్ కాలపరిమితిని పెంచుకోవాలనుకుంటే మీ లోన్ ఈఎంఐ రూ. 38,765 చెల్లిస్తే.. అదే లోన్ 321 నెలలు లేదా 26 సంవత్సరాల 10 నెలల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. లోన్ గడువు ముగిసే సమయానికి మీ మొత్తం వడ్డీ చెల్లింపు రూ. 88.52 లక్షలు అవుతుంది. ఈ సందర్భంలో మీరు అధిక ఈఎంఐకి బదులుగా ఈఎంఐ టెన్యూర్‌ కాలాన్ని పెంచుకుంటే మీరు రూ. 33 లక్షల అదనపు వడ్డీ చెల్లించకుండా ఉపశమనం పొందే అవకాశం లభిస్తుంది. 


మీరు హోమ్ లోన్ ఈఎంఐని పెంచాలా లేదా ఈఎంఐ చెల్లించే టెన్యూర్‌ కాలాన్ని పొడిగించాలా?

వడ్డీ రేటు పెరిగినప్పుడు, గృహ రుణగ్రహీత ఈఎంఐ లేదా లోన్ టెన్యూర్‌ కాలాన్ని ఎంపిక చేసుకోవడం మంచిదని ఆర్ధిక నిపుణులు సలహా ఇస్తున్నారు. 

(Disclaimer: హోమ్‌లోన్ల గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. రుణ గ్రహితలకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు తీసుకోవాలనుకుంటున్న హోమ్‌లోన్లు, ఇతర లోన్లపై సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Sweet Corn: శవాలను కాల్చేసిన బొగ్గులతో మొక్కజొన్న పొత్తులు కాలుస్తున్నారా ?

 Sweet Corn: శవాలను కాల్చేసిన బొగ్గులతో మొక్కజొన్న పొత్తులు కాలుస్తున్నారా ?

Sweet Corn: బొగ్గులపై కాల్చే మొక్కజొన్న పాత్తులను మనం ఇష్టంగా తింటాం. ఆ బొగ్గులను ఎక్కడి నుంచి తెస్తున్నారనేది పట్టించుకోం. తాజాగా ఓ వృద్ధుడు శ్మశానంలో శవాలను కాల్చగా మిగిలిన బొగ్గులను తీసుకొస్తుండగా అక్కడి నుంచి వెళుతున్న ఓ వ్యక్తి ఆ వృద్ధున్ని గమనించాడు.
ఆ ముసలాయన్ను ఆపి బొగ్గులను ఎక్కడికి, ఎందుకు తీసుకుని వెళుతున్నావు అంటూ ప్రశ్నించాడు. తాత ముందు సమాధానం చెప్పడానికి తడబడ్డాడు. ఆ వ్యక్తి ఒకటి రెండు సార్లు నిలదీయటంతో తాత నోరువిప్పాడు. ఈ బొగ్గులు మొక్కజొన్న కంకులు కాల్చేకి తీసుకువెళుతున్నట్లు చెప్పడంతో బైక్‌ పై వెళుతున్న వ్యక్తం ఖంగు తిన్నాడు. ఈ బొగ్గు నీవే మొక్కజొన్నలు కాల్చేకి తీసుకుపోతున్నావా? అంటూ అడగగా.. కాదు మొక్కజొన్న పొత్తులు కాల్చేవారికి అమ్మడానికి తీసుకువెళుతున్నట్లు తాత తెలిపాడు. ఇది కరెక్ట్‌ కాదు కాదా? దీని వల్ల సమస్యలు వస్తాయి కాదా ? అని బైక్‌ పై వెళుతున్న వ్యక్తి ప్రశ్నించగా.. బదులు ఇవ్వకుండా అక్కడనుంచి వెళ్లిపోయాడు తాత. శ్మశానంలోని బొగ్గులు తీసుకునేందుకు నీకు ఎవరు హక్కు ఇచ్చారు అంటూ ప్రశ్నించినా? పట్టించుకోలేదు. సర్పంచ్, అధికారులకు ఫోన్ చేస్తా ఆగు అంటూ బైక్ పై వున్న వ్యక్తి చెబుతున్న భయంతో వెనుతిరిగాడు తాత. ఈ ఘటన తెలంగాణలో జరగగా.. ఏ ఏరియాలో అన్నది వెల్లడి కాలేదు. 
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం మొక్కజొన్నలు ఇష్టంగా తింటాం అలాంటి మొక్కజొన్నలను శవాలు కాల్చేసిన బొగ్గులతో కాలుస్తున్నారా? అంటూ నోర్లు వెల్లబెడుతున్నారు. ఛీ చివరకు శవాలను కాల్చే బొగ్గులను కూడా మనషులు అమ్ముకోవాడానికి వెనుకాడటం లేదని మండిపడుతున్నారు. అయితే ఆవ్యక్తి ఎక్కడి శ్మశానంలో బొగ్గులను తీసుకువస్తున్నాడు. శ్మశానంలో బొగ్గులను ఎవరు అమ్ముతున్నారు. ఇలా అక్కడ వున్న ఒక్క శ్మశానం నుంచి మాత్రమేనా.. లేదా వేరే శ్మాశానాల్లో కూడా ఇలానే బొగ్గు విక్రయాలు జరుపుతున్నారా? అనే దానిపై నెటిజన్లు కమెంట్లు చేస్తు్న్నారు. ఏదీ ఏమైనా మొక్కజొన్న ఇష్టంగా తినే ప్రతి ఒక్కరు బయట కాల్చే మొక్కజొన్నలు తినేప్పుడు జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.


Jayalakshmi: నా తండ్రి శోభన్‌బాబు.. తల్లి జయలలిత.. ఎటువంటి సందేహాలు లేవు.. ఎన్నికల్లో పోటీ చేసి తీరుతా..

 Jayalakshmi: నా తండ్రి శోభన్‌బాబు.. తల్లి జయలలిత.. ఎటువంటి సందేహాలు లేవు.. ఎన్నికల్లో పోటీ చేసి తీరుతా..


- జయ కుమార్తెగా ప్రకటించుకున్న జయలక్ష్మి


చెన్నై , (ఆంధ్రజ్యోతి): తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత(Jayalalithaa)కు అసలైన కుమార్తెను తానేనని, ఇందుకోసం అవసరమైతే డీఎన్‌ఏ పరీక్షకు కూడా తాను సిద్ధమేనని జె.జయలక్ష్మి(Jayalakshmi) పునరుద్ఘాటించారు.

జయ మృతి చెందిన కొత్తలో ఆమె అసలు సంతానం తానేనంటూ మీడియాకు ముందుకు వచ్చిన జయలక్ష్మి.. మళ్లీ ఇన్నాళ్ల తరువాత శుక్రవారం దిండుగల్‌ జిల్లా కొడైకెనాల్‌(Kodaikanal)లో మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. ఆమె విలేఖరులతో మాట్లాడుతూ.. తన తండ్రి ప్రముఖ సినీనటుడు శోభన్‌బాబు(Shobhan Babu) అని తెలిపారు. బయటకు చెప్పుకోలేని వివిధ కారణాల వల్ల జయను వ్యక్తిగతంగా కలుసుకోలేకపోయానని, కానీ ఆమె సీఎంగా వున్నప్పుడు కొన్ని పనులపై రెండుసార్లు కలుసుకున్నానని తెలిపారు. అదేవిధంగా జయ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా ఓ సారి కలిశానన్నారు.

జయ సినిమాల్లో నటించేప్పుడు మాత్రం తాను పోయెస్ గార్డెన్‌లో నివశించానని, ఆ సమయంలో ఆమె రాసుకున్న డైరీ ఇప్పటికీ తన వద్ద ఉందని తెలిపారు. అంతేగాక జయ ఉపయోగించిన దుస్తులు, వస్తువులు తన వద్ద చాలా ఉన్నాయన్నారు. పలు కారణాల వల్ల తాను జయ కుమార్తెనని అప్పట్లో బహిరంగంగా ప్రకటించలేకపోయానన్నారు. జయ కుమార్తెనని నిరూపించుకునేందుకు తాను డీఎన్‌ఏ పరీక్షలకు కూడా సిద్ధమని, ఆ వివరాలను కోర్టుకు కూడా సమర్పిస్తానని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం 'అఖిల భారత ఎంజీఆర్‌ మున్నేట్ర కళగం' పేరుతో పార్టీని ప్రారంభించానని, మొత్తం 39 నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని జయలక్ష్మి పేర్కొన్నారు.

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top