స్థానికత గడువు మరో రెండేళ్లు పెంపుకేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ
దిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలివచ్చే వారికి స్థానికత కల్పించడానికి ఇప్పటివరకూ ఉన్న ఐదేళ్ల గడువును ఏడేళ్లకు పెంచుతూ కేంద్ర హోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన 2014 జూన్ 2 నుంచి ఏడేళ్లలోపు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలివచ్చిన వారు అక్కడ స్థానికత పొందడానికి వీలవుతుంది. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లయిన తర్వాతా ఇప్పటికీ వివిధ పోలీసు కేడర్తోపాటు, షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన అంశం కొలిక్కిరాకపోవడంతో ఆంధ్రప్రదేశ్కు చెందిన చాలామంది హైదరాబాద్తోపాటు, తెలంగాణలో ఉంటున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నందున చాలామంది సందిగ్ధంలో ఉన్నారు. దీంతో ఈ ఏడాది జూన్ 2తో ముగిసిన గడువును మరో రెండేళ్లపాటు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్ర హోంశాఖ మన్నించి ఆ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. తొలి ఉత్తర్వుల ప్రకారం 2017 జూన్ 2వరకూ గడువు విధించారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో దాన్ని 2019 జూన్ వరకు పొడిగించారు. ఇప్పుడు తాజాగా మరో రెండేళ్లు పెంచారు. దీని ప్రకారం 2021 జూన్ 2లోపు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి తరలివచ్చి ఏ ప్రాంతంలో స్థిరపడితే ఆ స్థానికతను కల్పించి విద్యా, ఉద్యోగావకాశాల్లో అందుకు తగ్గ ప్రాధాన్యం ఇస్తారు.
0 comments:
Post a Comment