సాంకేతిక పంథాలో పది పరీక్షలు
★ వచ్చే ఏడాది మార్చి 18 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల ఫీజు చెల్లింపు, నామినల్ రోల్స్ స్వీకరణ ప్రక్రియలను ప్రభుత్వ పరీక్షల విభాగం తొలిసారిగా ఆన్లైన్ పద్ధతిలో.★ విద్యార్థులకు హాల్టికెట్లను సైతం ఆన్లైన్లో జారీకి ఏర్పాట్లు.
★ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించేందుకు ఈ నెలాఖరు వరకూ అవకాశం.
★ ప్రస్తుత ఏడాది నుంచి పరీక్ష ఫీజుల చెల్లింపు, నామినల్ రోల్స్ సమర్పించే విధానాన్ని పూర్తిగా ఆన్లైన్లోకి మార్పు.
★ అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆధార్ సంఖ్య ఆధారంగా చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేసిన వివరాలను ఆధారంగా చేసుకుని పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో నిక్షిప్తం.
★ ఆయా వివరాలను ప్రభుత్వ పరీక్షల విభాగం తన వెబ్సైట్లో పొందుపర్చగా, టెన్త్ విద్యార్థుల వివరాలను సైతం ఇదే వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంది.
★ ఆన్లైన్ విధానంలో విద్యార్థికి సంబంధించిన సమగ్ర వివరాలను పక్కాగా నమోదు చేసేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం పటిష్టమైన చర్యలు.
★ పాఠశాలలకు ఇచ్చిన యూడైజ్ కోడ్, ఎస్సెస్సీ కోడ్ ఆధారంగా ఒక్కో విద్యార్థికి ప్రత్యేక అప్లికేషన్ ఫారం ఆన్లైన్లో పొందుపర్చారు.
★ ఇందులో విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, సామాజిక వర్గం, నివాస, పుట్టిన తేదీ, పరీక్ష లాంగ్వేజ్ తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంది.
★ విద్యార్థులకు అవే వివరాలతో హాల్ టికెట్లు జారీ చేస్తారు. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు విద్యాశాఖ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావచ్చు.
★ ఇప్పటివరకూ ఫీజు చెల్లించని విద్యార్థులు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించేందుకు ఈ నెలాఖరు వరకూ అవకాశం.
★ హెచ్ఎంలు సీఎఫ్ఎంఎస్ విధానం ద్వారా ఫీజు జమ చేసేందుకు తుది గడువు డిసెంబర్ ఒకటి.
★ నామినల్ రోల్స్ను డీఈవో కార్యాలయంలో సమర్పించేందుకు తుది గడువు డిసెంబర్ 3.
★ రూ.50 అపరాధ రుసంతో డిసెంబర్ 15, రూ.200 అపరాధ రుసుంతో డిసెంబర్ 24, రూ.500 అపరాధ రుసుంతో కలిపి పరీక్ష ఫీజు చెల్లించేందుకు జనవరి 3 వరకూ అవకాశం.
0 comments:
Post a Comment